LOADING...
E20 fuel row: ఎథనాల్ తర్వాత హైడ్రోజన్‌నే భవిష్యత్ ఇంధనమన్న నితిన్ గడ్కరీ...
ఎథనాల్ తర్వాత హైడ్రోజన్‌నే భవిష్యత్ ఇంధనమన్న నితిన్ గడ్కరీ...

E20 fuel row: ఎథనాల్ తర్వాత హైడ్రోజన్‌నే భవిష్యత్ ఇంధనమన్న నితిన్ గడ్కరీ...

వ్రాసిన వారు Moogati Shabari
Jul 08, 2026
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత రవాణా రంగంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనం తర్వాత హైడ్రోజన్‌నే తదుపరి ప్రధాన ప్రత్యామ్నాయ ఇంధనంగా అభివర్ణించారు. మంగళవారం నిర్వహించిన నవభారత్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం తాను స్వయంగా హైడ్రోజన్‌తో నడిచే వాహనాన్ని ఉపయోగిస్తున్నానని వెల్లడించారు. అలాగే హైడ్రోజన్‌తో పనిచేసే ట్రక్కులు, బస్సులు త్వరలోనే భారత రహదారులపై కనిపిస్తాయని చెప్పారు.

వివరాలు

హైడ్రోజన్‌ను ఉపయోగించేలా మార్పులు..

"నా వద్ద ప్రస్తుతం ఎలక్ట్రిక్, ఫ్లెక్స్-ఫ్యూయల్, హైడ్రోజన్ వాహనాలు మూడు ఉన్నాయి. ఈ మూడు కార్లను నేను స్వయంగా ఉపయోగిస్తున్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆసక్తి ఉన్నవారు నా ఇంటికి వచ్చి ఆ మూడు వాహనాల్లో ప్రయాణించి వాటి పనితీరును చూడొచ్చు" అని గడ్కరీ వ్యాఖ్యానించారు. హైడ్రోజన్ ఆధారిత భారీ వాహనాల అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు. ఇటీవల టాటా సంస్థ తయారు చేసిన రెండు హైడ్రోజన్ ట్రక్కులను తాను ప్రారంభించానని చెప్పారు. వాటిలో ఒకటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో పనిచేస్తుండగా, మరొకటి హైడ్రోజన్‌ను ఉపయోగించేలా మార్పులు చేసిన ఇంటర్నల్ కంబషన్ (ఐసీ) ఇంజిన్‌తో రూపొందించబడిందని వివరించారు.

వివరాలు

E20 ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ప్రజల్లో అసంతృప్తి..

ఇదిలా ఉండగా, దేశంలో E20 ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొన్ని రకాల కార్లపై E20 పెట్రోల్ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడం లేదా చర్చించకపోవడం గమనార్హం. గత ఆదివారం ఢిల్లీలో పలువురు వాహనదారులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. E20 ఇంధనాన్ని మాత్రమే అందుబాటులో ఉంచకుండా, సాధారణ పెట్రోల్, డీజిల్‌తో పాటు వినియోగదారులకు ఎంపిక చేసే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement