LOADING...
jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉదయం సుమారు 5.35 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్నవారు అకస్మాత్తుగా వచ్చిన శబ్దం, ప్రకంపనలతో ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఈ భూకంపానికి కేంద్రం బద్గాం జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూమి అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ఏర్పడ్డాయని తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న బద్గాం జిల్లాతో పాటు శ్రీనగర్‌, పుల్వామా, షోపియాన్‌, చరార్‌-ఇ-షరీఫ్‌ తదితర ప్రాంతాల్లో భూమి స్పష్టంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు.

Details

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు

ప్రకంపనలు కొన్ని సెకన్లపాటు కొనసాగాయని చెప్పారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని సామాన్లు కింద పడటం, కిటికీలు ఊగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మవద్దని వారు సూచించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న జమ్మూ-కాశ్మీర్ ప్రాంతం భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న సీస్మిక్‌ జోన్‌లో ఉన్నందున ఇలాంటి ప్రకంపనలు తరచూ సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement