NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత
    తదుపరి వార్తా కథనం
    Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత
    మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత

    Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 07, 2024
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో శనివారం మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

    మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి ప్రాంతంలో ఈసారి భూకంప కేంద్రంగా నమోదైంది.

    నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది.

    భూమి కంపించడంతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    మూడ్రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ములుగు జిల్లా మేడారం ప్రాంతం కేంద్రంగా నమోదైన ఆ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతను గణించుకుంది.

    Details

    ఇటీవల తెలంగాణలో వరుస భూకంపాలు

    ఈ భూకంపం దాదాపు 40 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకున్నట్లు నిపుణులు వెల్లడించారు.

    ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో వరుస భూకంపాలు సంభవించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

    ప్రత్యేకంగా, ములుగు జిల్లా మేడారం, మారేడుపాక, బోర్లగూడెం ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

    ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు భద్రతతో ఉండాలని, భూకంప సమయంలో ఎలా స్పందించాలనే మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    తెలంగాణ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భూకంపం

    Jammu and Kashmir Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం  జమ్ముకశ్మీర్
    World Round 2023: ఈ ఏడాది విపత్తులు మిగిల్చిన విషాదాలు. భీకర యుద్ధాలివే! ఇండియా
    Earthquakes: జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు   జపాన్
    Earthquake: జపాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జపాన్

    తెలంగాణ

    Telangana: నాగార్జునసాగర్‌ డ్యాంను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలి నాగార్జునసాగర్
    Telangana: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేసిన హైకోర్టు  భారతదేశం
    US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే! ఆంధ్రప్రదేశ్
    Group-1: గ్రూప్-1 పిటిష‌న్ల‌పై విచార‌ణ న‌వంబ‌ర్ 26కు వాయిదా హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025