NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Araku Trains: అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్.. కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు 
    తదుపరి వార్తా కథనం
    Araku Trains: అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్.. కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు 
    అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్

    Araku Trains: అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్.. కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈస్ట్ కోస్ట్ రైల్వే పర్యాటకులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. అరకు ప్రాంతం అందాలను అనుభవించేందుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

    ఈ సీజన్‌లో అరకు ప్రాంతాన్ని సందర్శించనున్న పర్యాటకులు, ప్రయాణికుల సౌకర్యం కోసం, అలాగే వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ నిర్ణయం తీసుకుంది.

    విశాఖపట్నం-కిరండూల్ (08551) రైలు, డిసెంబర్ 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 29, 31 తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్‌తో ప్రయాణిస్తుంది.

    వివరాలు 

    రైళ్ల నెంబర్ల మార్పు 

    కిరండూల్-విశాఖపట్నం (08552) రైలు, డిసెంబర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 2025 జనవరి 1 తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్‌తో ప్రయాణిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ సూచించారు.

    2025 మార్చి నుంచి అమలులోకి వచ్చే వాల్తేర్ డివిజన్ ఒరిజిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లను మార్చాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.

    మార్చి 2025 నుండి అమలులో ఉండే ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు

    విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488)నెంబర్‌ను మార్చి 18521గా మార్చారు.

    కడప-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17487) నెంబర్‌ను మార్చి 18522గా మార్చారు.

    విశాఖపట్నం-బనారస్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18311)నెంబర్‌ను మార్చి 18523గా మార్చారు.

    వివరాలు 

    2025 మార్చి 1 నుండి అమలులోకి

    బనారస్-విశాఖపట్నం బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18312) నెంబర్‌ను మార్చి 18524గా మార్చారు.

    విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు (18513) నెంబర్‌ను మార్చారు.

    కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు (18514) నెంబర్‌ను మార్చారు.

    విశాఖపట్నం-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701) నెంబర్‌ను మార్చి 22875గా మార్చారు.

    గుంటూరు-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702) నెంబర్‌ను మార్చి 22876గా మార్చారు.

    ఈ మార్పులు 2025 మార్చి 1 నుండి అమలులోకి రానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరకు లోయ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అరకు లోయ

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ
    Araku: నేటి నుండి అరకులోయలో ఎగరనున్న బెలూన్లు.. ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పర్యాటకలు.. స్థానికులు.. లైఫ్-స్టైల్
    Araku-Lambasingi: అరుకు, లంబసింగి అందాలను చూసేందుకు ఇదే సరైన సమయం.. ప్రకృతి అందాలకు స్వాగతం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025