NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
    తదుపరి వార్తా కథనం
    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

    వ్రాసిన వారు Stalin
    Apr 20, 2023
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలో దారణం జరిగింది.

    తరగతి గదిలో ఉపాధ్యాయుల సమక్షంలో తొమ్మిదో తరగతి చదవుతున్న ఒక విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.

    పరీక్ష జరుగుతుండగా ఎగ్జామ్ హాలులోనే ఉపాధ్యాయుల ఎదుటే విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఈ హింసకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    తూర్పుగోదావరి

    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి హరీష్ 

    ఈ దారుణానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజానగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెంకే శ్రీహరి సాయి, ఉదయ్ శంకర్ అనే ఇద్దరు బాలురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

    ఈ క్రమంలో గురువారం ఉదయం పరీక్ష హాలులో పరీక్ష రాస్తున్న శ్రీహరి సాయిపై ఉదయ్ శంకర్ అనే విద్యార్థి కత్తితో దాడి చేశాడు. అనంతరం ఉదయ్ అక్కడి నుంచి పారిపోయాడు.

    వెంటనే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యార్థులు
    ఉపాధ్యాయులు

    తాజా

    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ

    ఉపాధ్యాయులు

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025