NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'
    భారతదేశం

    ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'

    ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 29, 2022, 04:37 pm 1 నిమి చదవండి
    ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'
    'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'కు ఈసీ శ్రీకారం

    దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరిస్థితులు అనుకూలించక పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు వేయలేని వారు చాలా మంది ఉంటారు. అలా గ్రామాలకు వచ్చి ఓటవేయలేని వారికోసం ఎన్నికల సంఘం 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'ను తీసుకురావాలని నిర్ణయించింది. 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'కు సంబంధించిన నమూనాను ఇప్పటికే సిద్ధం చేసిన ఈసీ.. ఒకే పోలింగ్ బూత్ ద్వారా దాదాపు 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా తీర్చిదిద్దింది.

    వచ్చే నెల 16న ప్రదర్శన..

    ఈ కొత్త రిమోట్ ఆర‌వీఎం విషన్‌ నమూనాను వచ్చే నెల 16న ప్రదర్శనకు ఉంచనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీన్ని పరిశీలించేందుకు అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆహ్వానం పంపింది. అయితే రిమోట్ ఆర‌వీఎం విషన్‌‌పై అన్ని పరీక్షలు పూర్తయ్యాకే.. వినియోగించనున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాకుండా.. రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌పై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా ఈసీ కోరింది. రాజకీయ పార్టీల సూచనల మేరకు కూడా మిషన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85శాతం మంది ఇలాంటి వారే ఉన్నారని, వారి సౌలభ్యం కోసమే ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఈసీ పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం

    తాజా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    భారతదేశం

    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు పన్ను
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023