NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ 
    తదుపరి వార్తా కథనం
    రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ 
    రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ

    రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ 

    వ్రాసిన వారు Stalin
    Jul 03, 2023
    03:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజకీయ పార్టీలు ఇకనుంచి ఆన్‌లైన్ మోడ్‌లో కూడా తమ ఆర్థిక ఖాతాలను దాఖలు చేయవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

    ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను సోమవారం ప్రారంభించినట్లు ఈసీ తెలిపింది.

    ఎన్నికల కమిషన్ మూడు రకాల నివేదికలను దాఖలు చేయడానికి వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.

    రాజకీయ పార్టీల కంట్రిబ్యూషన్ రిపోర్ట్, ఆడిట్ చేసిన వార్షిక ఖాతా, ఎన్నికల వ్యయ ప్రకటనలకు సంబంధించిన నివేదికలను పోర్టల్‌లో సమర్పించడానికి అవకాశం కల్పించింది.

    రెండు లక్ష్యాలతో కొత్త వెబ్ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు ఎన్నికల కమిషన్ చెప్పింది.

    ఒకటి భౌతికంగా నివేదికలను దాఖలు చేయడంలో ఇబ్బందులను అధిగమించడం, రెండోది ప్రామాణికంగా సకాలంలో దాఖలు చేసేందుకు ఈ వెబ్ పోర్టల్‌ ఉపయోగపడుతుందని ఈసీ భావిస్తోంది.

    ఈసీ

    ఆన్‌లైన్ పోర్టల్ వినియోగాన్ని వివరించేందుకు ప్రత్యేక శిక్షణ

    ఆన్‌లైన్ పోర్టల్ వినియోగాన్ని వివరించేందుకు ఎన్నికల సంఘం శిక్షణా సెషన్‌లను నిర్వహించనుంది.

    ఈ పరిణామం రాజకీయ పార్టీలు వెల్లడించే ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకతను తీసుకొస్తుందని ఈసీ భావిస్తోంది.

    ఈసీ తీసుకున్న ఈ చర్యను పోల్ ప్యానెల్‌లోని 3సీ వ్యూహంలో ఒక భాగమే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    రాజకీయ నిధులు, వ్యయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి ఇది దోహదపడనుంది.

    చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈసీఐ ఏడాది పాటు దీనిపై కసరత్తు చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

    ఆన్‌లైన్ మోడ్‌ను ఉపయోగించని పార్టీలు అలా చేయడానికి కారణాలను తెలియజేయాలయని ఈసీ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ భారతదేశం
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల తెలంగాణ
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ

    తాజా వార్తలు

    జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ జమ్ముకశ్మీర్
    ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ నరేంద్ర మోదీ
    అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ మమతా బెనర్జీ
    టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే  ధర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025