Page Loader
ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు
ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు

ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Stalin
Jul 27, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15వరకు పొడిగించాలన్న కేంద్రం అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15వరకు పొడిగించేందుకు ధర్మాసనం అనుమతించింది. మిశ్రా పదవీకాలం జూలై 31తో ముగియాల్సి ఉంది. ఇదివరకు ఆయనకు కేంద్రం ఇచ్చిన పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటీఎఫ్) సమీక్షను దృష్టిలో ఉంచుకుని మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. విస్తృతమైన జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని సెప్టెంబర్ 15వరకు పదవీకాలాన్ని పొడిగించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ విషయంలో పొడిగింపు కోసం తదుపరి దరఖాస్తును స్వీకరించబోమని సుప్రీంకోర్టు తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మరో దరఖాస్తును స్వీకరించబోము: సుప్రీంకోర్టు