NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్‌టెక్‌ కంపెనీ రచ్చ
    తదుపరి వార్తా కథనం
    ఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్‌టెక్‌ కంపెనీ రచ్చ
    ఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్‌టెక్‌ కంపెనీ రచ్చ

    ఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్‌టెక్‌ కంపెనీ రచ్చ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 05, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ కంపెనీ తన ఉద్యోగుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించింది. పర్మిషన్ లేకుండా బయటకెళ్లేందుకు కుదరదంటూ ఆఫీసు డోరుకు తాళాలు పెట్టించింది. హరియాణాలోని గురుగ్రామ్‌ పరిధిలోని కోడింగ్‌ నింజాస్‌ అనే ఎడ్‌టెక్‌ సంస్థ నిర్వాకం విమర్శలకు తావిచ్చింది.

    ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులెవరూ బయటకెళ్లకుండా యాజమాన్యం, ఆఫీసు గేటుకు తాళాలు వేయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ కు గురవుతోంది. ఈ వీడియోలో వాచ్‌మెన్‌ ఆఫీస్ గేటుకు తాళాలు వేస్తూ కనిపించారు.

    అదేంటని ఉద్యోగి అడిగితే అనుమతి లేకుండా ఎవర్ని బయటకు పంపించకూడదని మేనేజర్‌ చెప్పారన్నారు. ఒకవేళ వెలుపలికి వెళ్లాలంటే అనుమతి తెచ్చుకోండని వాచ్‌మెన్‌ అంటున్న మాటలు వీడియోలో ఉండటంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    Edtech Company Trolled By Netizens 

    మరోసారి ఇలా జరగకుండా చూస్తాం : ఎడ్‌టెక్‌ 

    కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగుల పని వాతావరణం రోజురోజుకూ దిగజారుతోందని, ఇంతకంటే దారుణం ఉంటుందా అంటూ మండిపడుతున్నారు.

    విషయం కాస్త కంపెనీ చెవిన పడటంతో కోడింగ్‌ నింజాస్‌ స్పందించింది. తమ కంపెనీకి చెందిన ఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి చేసిన విపరీత చర్య వల్లే తాము అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నామని, అయితే కొద్ది క్షణాల్లోనే దాన్ని సరిదిద్దామని కంపెనీ సమర్థించుకుంది.

    సదరు ఉద్యోగి తన పొరబాటును అంగీకరించి క్షమాపణలు కూడా తెలియజేశారని వెల్లడించింది. ఈ అసౌకర్యానికి కంపెనీ వ్యవస్థాపకులు సైతం విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారని సంస్థ వివరించింది.

    మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామంది. సదరు ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నామని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంస్థ
    ట్విట్టర్

    తాజా

    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం

    సంస్థ

    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 ఆపిల్
    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం ఉద్యోగుల తొలగింపు

    ట్విట్టర్

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ఫీచర్
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సంస్థ
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025