LOADING...
Eknath Shinde: పురపాలిక ఎన్నికల వేళ.. మహారాష్ట్ర ఎన్డీయే కూటమిలో విభేదాలు.. సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే సంచలన వ్యాఖ్యలు
సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే సంచలన వ్యాఖ్యలు

Eknath Shinde: పురపాలిక ఎన్నికల వేళ.. మహారాష్ట్ర ఎన్డీయే కూటమిలో విభేదాలు.. సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార మహాయుతి కూటమిలో అంతర్గత వాదవివాదాలు మరింత బలపడాయి. ముఖ్యంగా, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేయకూడదని బీజేపీ, శివసేన (షిండే గుంపు) మధ్య ఉన్న ఒప్పందం ఉల్లంఘించబడటంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామం ముంబయి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే‌లు ఈ విభేదాలపై ప్రచారం జరుగుతున్న విషయాన్ని పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఒకరి తోకోరి కలవకపోవడం, శివసేన మంత్రులు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలకు హాజరుకాకపోవడం వంటి ఘటనలు కూటమి లోపల ఉన్న విభేదాలను సూచిస్తున్నాయి. అదే సమయంలో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించింది.

వివరాలు 

హోటల్‌లో ఉన్నా ఎందుకు కలుసుకోలేదు 

గత వారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నా ఎందుకు కలుసుకోలేదన్న ప్రశ్నకు ఫడ్నవీస్ నవ్వుతూ స్పదించారు. "ఆయన (షిండే) వెళ్లిపోయాకనే నేను రాత్రి ఆలస్యంగా వచ్చాను. మా సమావేశాల సమయాలు వేర్వేరు కాబట్టి కలవలేకపోయాం. అయితే కలుసుకుంటాం. ఇందులో ఏ సమస్య లేదు. ప్రచారంతో బిజీగా ఉన్నాం, కానీ రోజూ ఫోన్ ద్వారా కూడా మాట్లాడుకుంటున్నాం" అని స్పష్టం చేశారు. షిండే మాట్లాడుతూ,"ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని సీరియస్‌గా తీసుకోను.నా దృష్టి పనిపైే ఉంటుంది.ఈ కూటమి నిన్నో, మొన్నో ఏర్పడలేదు.ఇది సాధారణ సిద్ధాంతాలపై,ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పడినది" అని పేర్కొన్నారు.

వివరాలు 

పాత కార్యకర్తలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు 

అలాగే, "మేము సంకీర్ణ ధర్మాన్ని కచ్చితంగా పాటిస్తాం, కూటమి భాగస్వాములు కూడా అదే విధంగా క్రమశిక్షణ పాటించాలి" అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. మహాయుతిలోని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ చేసిన వ్యాఖ్యలు కూడా కూటమి లోపల విభేదాలను బహిర్గతం చేశాయి. ఎన్సీపీ నేత, అజిత్ పవార్ సన్నిహితుడు మాణిక్‌రావ్ కొకాటే వ్యాఖ్యానించినట్లు, "బీజేపీ పూర్తిగా విభజన రాజకీయాలకే ఆధారపడింది. వారికి స్వంత సిద్ధాంతాలు లేవు. వారి రాజకీయ జీవితమంతా మానిప్యులేషన్, చీలికల చుట్టూ తిరుగుతోంది. తమ పాత కార్యకర్తలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు" అని తెలిపారు. ఇక, శివసేన కార్యకర్తలు, నాయకులను బీజేపీ లోకి చేర్చడంపై షిండే సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

వివరాలు 

కూటమిలో అంతా సవ్యంగా లేదన్న మంత్రి ఉదయ్ సామంత

ఫలితంగా, శివసేన మంత్రులు రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయంపై శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి ఉదయ్ సామంత మాట్లాడుతూ, 'బహిష్కరణ' వార్తలను కొట్టిపారేశారు కానీ కూటమిలో అంతా సవ్యంగా లేదని అంగీకరించారు. వివాదాలు పెరుగుతున్న నేపథ్యలో, ఒకరి కార్యకర్తలను, కార్యవర్గ సభ్యులను మరొక పార్టీకి చేరదీయరాదు అని బీజేపీ-శివసేన ఒక అనధికారిక ఒప్పందానికి వచ్చాయి. అయినప్పటికీ, రూప్‌సింగ్ ధాల్, ఆనంద్ ధోకే, శిల్పరాణి వాడ్కర్, అనమోల్ మ్హత్రే వంటి పలువురు శివసేన నాయకులు బీజేపీలో చేరడం గమనార్హం. ఈ పరిణామం కేవలం బీజేపీ-శివసేన సంబంధాలను దెబ్బతీయడమే కాక, ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.

Advertisement

వివరాలు 

థానేలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ

అదే రోజు, ఆదివారం థానేలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే వికాస్ మ్హత్రే మద్దతుదారులు, బీజేపీ నుండి శివసేనలో చేరినవారూ బీజేపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement