Lok sabha Elections:లోక్సభ ఎన్నికల తొలి దశకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల
2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19న నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ తోలి విడతలో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 27వరకు నామినేషన్ల స్వీకరణ,28న పరిశీలన,30న ఉపసంహరణకు తుది గడువు. అత్యధికంగా తమిళనాడులో ఒకే విడతలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుండగా రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8,మధ్యప్రదేశ్లో 6 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. వాటితో పాటు ఉత్తరాఖండ్,అస్సాం,మహారాష్ట్రల్లో ఐదు సీట్లు,బిహార్ లో నాలుగు,పశ్చిమ బెంగాల్లో మూడు,అరుణాచల్ ప్రదేశ్,మణిపూర్,మేఘాలయలో రెండు,ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర,అండమాన్, నికోబార్ దీవుల్లో ఒక సీటు.జమ్ముకశ్మీర్,లక్షద్వీప్,పుదుచ్చేరిలలో కూడా ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.