EC : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల డేట్ ఫిక్స్?.. రేపు ఈసీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముందని సమాచారం. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి మే నుంచి జూన్ మధ్య ముగియనుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేసింది.
Details
తమిళనాడులో ఏప్రిల్ రెండో వారం
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7న ముగుస్తుంది. తమిళనాడు అసెంబ్లీ గడువు మే 10న ముగుస్తుంది. అస్సాం అసెంబ్లీ గడువు మే 20న ముగుస్తుంది. కేరళ అసెంబ్లీ గడువు మే 23న ముగుస్తుంది. పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15న ముగియనుంది. సాధారణంగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. అయితే వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బహుళ దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ రెండో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Details
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75,032 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
తమిళనాడులో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75,032 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రీసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులు, ఒక కార్యాలయ సహాయకుడు ఉండేలా బృందాలను నియమించనున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,45,160 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. గత 2021 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఫిబ్రవరి చివరి వారంలో ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తమిళనాడులో ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. అదే సమయంలో వెస్ట్ బెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించగా, ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టారు.