Air India: ఎయిరిండియా విమానంలో బాంబు బెదిరింపు.. తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరకోగానే పైలట్కు బాంబు బెదిరింపు సమాచారం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు అదేశించారు.