NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం
    తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం

    Telangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 06, 2025
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఎంత బంగారం, వెండి ఉందో ఇటీవల దేవాదాయశాఖ అధికారులు వివరించారు.

    రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలతో పాటు, అన్ని ఆలయాల్లోని బంగారం, వెండి నిల్వలు కూడా వెల్లడించారు.

    వేములవాడ రాజన్న ఆలయంలో 97 కిలోల బంగారం ఉందని, ఆ తర్వాత భద్రాచలంలో రామయ్యకు 67 కిలోల బంగారం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి 61 కిలోల బంగారం ఉందని పేర్కొన్నారు.

    మొత్తం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో 1,048 కేజీల బంగారం ఉంది.

    వివరాలు 

    ఆర్జేసీ కేటగిరిలో  వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట

    తెలంగాణలో మొత్తం 704 ఆలయాలు ఉన్నాయి. వాటి ఆదాయం ఆధారంగా, ఆయా ఆలయాలను రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ), జిల్లా కమిషనర్ (డీసీ), అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ)లు నిర్వహిస్తారు.

    ఆర్జేసీ కేటగిరిలో ఉన్న ఆలయాలు వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్టలో ఉన్నాయి.

    డీసీ కేటగిరిలో కొండగట్టు ఆంజనేయస్వామి, కొమరవెల్లి మల్లికార్జునస్వామి, బాసర సరస్వతీ ఆలయం, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్స్ ఉన్నాయి. ఏసీ కేటగిరిలో మరో 13 ఆలయాలు ఉన్నాయి.

    మిగిలిన ఆలయాలు 6(ఏ), (బీ), (సీ), (డీ) కేటగిరీల్లో ఉన్నాయి.

    వెండి నిల్వల విషయానికి వస్తే, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో మొత్తం 38,783 కిలోల వెండి ఉన్నట్లు వెల్లడించారు.

    వివరాలు 

    త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాత మాత్రమే బంగారం కరిగించే అవకాశం

    రాజన్న ఆలయంలో 4,930 కిలోల వెండి, యాదగిరిగుట్టలో 2,312 కిలోల వెండి, భద్రాచలంలో 980 కిలోల వెండి ఉంది.

    డీసీ కేటగిరీలోని 4 ఆలయాల్లో 3,331 కిలోల వెండి, ఏసీ కేటగిరిలోని 13 ఆలయాల్లో 4,415 కిలోల వెండి ఉంది. 6(ఏ), (బీ), (సీ), (డీ) కేటగిరీల్లో 22,811 కిలోల వెండి ఉంది.

    భక్తులు అందించే బంగారం కేవలం ప్రభుత్వ అనుమతి మేరకే కరిగించబడుతుంది.

    ఆలయాల అవసరానికి అనుగుణంగా, త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాత మాత్రమే బంగారం కరిగించే అవకాశం ఉంటుంది.

    ఏ ఆలయానికి సంబంధించిన బంగారం ఆ ఆలయం పరిధిలోనే ఉంటుంది, అని అధికారులు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

     Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌! లైఫ్-స్టైల్
    Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత హైదరాబాద్
    Telangana High Education council: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం భారతదేశం
    AP Govt : ఏపీలో చేనేత వస్త్రాల ధరలు పెంచిన సర్కారు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025