LOADING...
Telangana: భవిష్య నిధి కనీస నిల్వ 25 శాతం.. అమలుకు త్వరలోనే గెజిట్‌ నోటిఫికేషన్
భవిష్య నిధి కనీస నిల్వ 25 శాతం.. అమలుకు త్వరలోనే గెజిట్‌ నోటిఫికేషన్

Telangana: భవిష్య నిధి కనీస నిల్వ 25 శాతం.. అమలుకు త్వరలోనే గెజిట్‌ నోటిఫికేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)-2026, ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)-2026 అనే కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎఫ్‌-1952,ఈపీఎస్‌-1995 పథకాల స్థానంలో ఇవి అమలులోకి రానున్నాయి. ఇటీవల సమావేశమైన ఈపీఎఫ్‌ఓ కేంద్ర ట్రస్టీ బోర్డు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలను ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర కార్మికశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

వివరాలు 

పలు కేటగిరీల్లో ఈపీఎఫ్‌ ఉపసంహరణల సంఖ్య పెంపు 

కొత్త పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా, భవిష్యత్తులో అవసరాన్ని బట్టి అన్ని వర్గాలతో చర్చించి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని కేంద్రం వెల్లడించింది. అలాగే పలు కేటగిరీల్లో ఈపీఎఫ్‌ ఉపసంహరణల సంఖ్యను పెంచడం జరిగింది. పింఛన్‌ ఖరారు చేసే సమయంలో దామాషా విధానం అనుసరిస్తామని కూడా తెలిపింది. యజమాని ప్రతి నెలా చెల్లించాల్సిన పీఎఫ్‌ వాటాను ఉద్యోగి వేతనం నుంచి మినహాయించరాదు అని స్పష్టం చేసింది. అలాగే ఆ మొత్తాన్ని తరువాత ఉద్యోగి నుంచి తిరిగి వసూలు చేయడానికీ అనుమతి ఉండదు. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వివరాలు 

కనీస నిల్వకు లెక్క ఇలా...

కొత్త ఈపీఎఫ్‌-2026 నిబంధనల ప్రకారం భవిష్య నిధి ఖాతాలో కనీసం 25 శాతం నిల్వ తప్పనిసరిగా ఉంచాలి అని బోర్డు నిర్ణయించింది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది. క్లెయిమ్‌ దాఖలు చేసే సమయానికి ఉద్యోగి,యజమాని చెల్లించిన మొత్తం,అలాగే ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ కలిపి ఏర్పడే మొత్తం భవిష్య నిధి నిల్వగా పరిగణిస్తారు. ఆ మొత్తంలో 25 శాతం కనీస నిల్వగా ఉంచి, మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు భవిష్య నిధి ఖాతాలో కనీస నిల్వ ఉండాలనే నిబంధన లేదు.

Advertisement

వివరాలు 

ఉపసంహరణలు ఇలా...

కేటగిరీ-1: ఈపీఎఫ్‌ సభ్యత్వం ప్రారంభమైన 12 నెలల తరువాత అనారోగ్యం, విద్య, వివాహం వంటి అవసరాల కోసం ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనారోగ్యం కోసం ఏడాదిలో మూడుసార్లు విద్య కోసం మొత్తం ఉద్యోగ కాలంలో పది సార్లు వివాహం కోసం ఐదు సార్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కేటగిరీ-2: ఇల్లు కొనుగోలు చేయడం, నిర్మాణం, గృహ రుణ చెల్లింపులు లేదా మరమ్మతుల కోసం కనీసం 12 నెలల చందా చెల్లించిన సర్వీసు ఉండాలి. ఈ కేటగిరీలో మొత్తం సర్వీసులో ఐదు సార్లు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ అవకాశం రెండు సార్లకే పరిమితం అయింది.

Advertisement

వివరాలు 

కేటగిరీ-3:

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సంవత్సరం సర్వీసు పూర్తి కాకపోయినా కూడా క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కనీస నిల్వను మినహాయించిన తరువాత మిగిలిన మొత్తాన్ని మాత్రమే నగదుగా పొందవచ్చు. పూర్తి ఉపసంహరణ ఉద్యోగి 55 సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు, లేదా ఆ వయసుకు ముందే ఉద్యోగాన్ని వదిలివేసినా, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లినా, లేదా ఉద్యోగం నుంచి తొలగించినా కూడా భవిష్య నిధి ఖాతాలో ఉన్న మొత్తం నిల్వను పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.

Advertisement