NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    ఆ ఆరు దేశాల  మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
    కొత్త మార్గదర్శకాలు విడుదల

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

    వ్రాసిన వారు Stalin
    Jan 02, 2023
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

    అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హై‌రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72గంటల ముందే ఆర్‌టీ‌పీసీఆర్ పరీక్షలను చేయించి నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని డిసెంబర్ 29న జారీ‌చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది. హై‌రిస్క్ దేశాల జాబితాలో చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, జపాన్, సింగపూర్ ఉన్నాయి.

    తాజా మార్గదర్శకాల్లో కేంద్రం ఏం చెప్పిందంటే.. హై రిస్క్ దేశాల నుంచి నేరుగా రావడం మాత్రమే కాదు.. ఆ దేశాల గుండా వచ్చినా నెగిటివ్ రిపోర్టును 72 గంటల ముందే సమర్పించాలని స్పష్టం చేసింది.

    కరోనా

    జనవరి 1 నుంచి అమలు..

    జనవరి 1వ తేదీ నుంచి ఆర్‌టీ పీసీఆర్ నెగిటివ్ సమర్పించే నిబంధనల అమలవుతోంది. అయితే విమానాశ్రయాల్లో చేసే 2శాతం రాండమ్ టెస్టులకు.. వీటికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. నెగిటివ్ రిపోర్టు సమర్పించిన వాళ్లకు కూడా భారతీయ విమానాశ్రయాల్లో రాండమ్ టెస్టులు జరుగుతాయని కేంద్రం పేర్కొంది.

    ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల్లో చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, జపాన్‌లోనే భారీగా నమోదవుతున్నాయి. అందుకే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికలపై మరింత ఫోకస్ పెట్టాలని కేంద్రం ఆదేశించింది. హై రిస్క్ దేశాల నుంచి నేరు వచ్చే వారే కాకుండా.. ఆ దేశాల మీదుగా వచ్చే వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త మార్గదర్శకాలు
    చైనా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కోవిడ్

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025