NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
    భారతదేశం

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 02, 2023, 05:28 pm 0 నిమి చదవండి
    ఆ ఆరు దేశాల  మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
    కొత్త మార్గదర్శకాలు విడుదల

    ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హై‌రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72గంటల ముందే ఆర్‌టీ‌పీసీఆర్ పరీక్షలను చేయించి నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని డిసెంబర్ 29న జారీ‌చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది. హై‌రిస్క్ దేశాల జాబితాలో చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. తాజా మార్గదర్శకాల్లో కేంద్రం ఏం చెప్పిందంటే.. హై రిస్క్ దేశాల నుంచి నేరుగా రావడం మాత్రమే కాదు.. ఆ దేశాల గుండా వచ్చినా నెగిటివ్ రిపోర్టును 72 గంటల ముందే సమర్పించాలని స్పష్టం చేసింది.

    జనవరి 1 నుంచి అమలు..

    జనవరి 1వ తేదీ నుంచి ఆర్‌టీ పీసీఆర్ నెగిటివ్ సమర్పించే నిబంధనల అమలవుతోంది. అయితే విమానాశ్రయాల్లో చేసే 2శాతం రాండమ్ టెస్టులకు.. వీటికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. నెగిటివ్ రిపోర్టు సమర్పించిన వాళ్లకు కూడా భారతీయ విమానాశ్రయాల్లో రాండమ్ టెస్టులు జరుగుతాయని కేంద్రం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల్లో చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, జపాన్‌లోనే భారీగా నమోదవుతున్నాయి. అందుకే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికలపై మరింత ఫోకస్ పెట్టాలని కేంద్రం ఆదేశించింది. హై రిస్క్ దేశాల నుంచి నేరు వచ్చే వారే కాకుండా.. ఆ దేశాల మీదుగా వచ్చే వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని చెప్పింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    దక్షిణ కొరియా
    జపాన్
    చైనా

    తాజా

    IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ లక్నో సూపర్‌జెయింట్స్
    బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్ టీమిండియా
    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ కల్వకుంట్ల కవిత
    ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం టీమిండియా

    దక్షిణ కొరియా

    స్వలింగ జంటకు హక్కులను గుర్తిస్తూ హైకోర్టు సంచలన తీర్పు అంతర్జాతీయం
    మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల ఆటో మొబైల్
    కిమ్‌కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు! ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్ కార్

    జపాన్

    2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్ ఆటో మొబైల్
    సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100 ఆటో మొబైల్
    IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు విమానం
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    చైనా

    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా ఆర్మీ
    కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు ప్రపంచ ఆరోగ్య సంస్థ
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు భారతదేశం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023