English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు
    జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు

    Andhra Pradesh: జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 22, 2025
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డిలో నాలుగు వరుసలుగా విస్తరణకు సంబంధించి రెండు కీలక ప్యాకేజీలకు ఆమోదం లభించింది.

    ఇందులో బుగ్గ-గిద్దలూరు మధ్య 135 కి.మీ, వినుకొండ-గుంటూరు మధ్య 84.80 కి.మీ కలిపి మొత్తం 219.80 కి.మీ విస్తరణ పనులు ఉంటాయి.

    ఈ రెండు ఎలైన్‌మెంట్లకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఈ పనులకు రూ.5,417 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది. అదనంగా ఈ రెండు ప్యాకేజీలలో 21 చోట్ల బైపాస్‌లు నిర్మించడానికి అనుమతి ఇచ్చారు.

    Details

    గిద్దలూరు-వినుకొండ మినహా

    అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎన్‌హెచ్‌-544డి జాతీయ రహదారి ముచ్చుకోట, బుగ్గ, కైప, గిద్దలూరు, వినుకొండ మీదుగా విస్తరించింది.

    ప్రస్తుతం అనంతపురం నుంచి బుగ్గ వరకు నాలుగు వరుసలుగా విస్తరణ పనులు జరుగుతున్నాయి.

    గిద్దలూరు-వినుకొండ మధ్య 135 కి.మీ రెండు వరుసలుగా విస్తరించి 2022లో పూర్తిచేసి నిర్వహణను గుత్తేదారుకు అప్పగించారు. మిగిలిన బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు విభాగాలు మాత్రమే విస్తరించాల్సి ఉంది.

    తాజా నిర్ణయంతో ఈ రెండు భాగాలను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.

    తద్వారా, అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న రహదారిలో గిద్దలూరు-వినుకొండ 135 కి.మీ మినహా మిగతా రహదారులన్నీ నాలుగు వరుసలుగా మారనున్నాయి.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

     అటవీ ప్రాంతంలోనూ నాలుగు వరుసలు

    బుగ్గ-గిద్దలూరు విస్తరణలో 135 కి.మీ లోపు 25 కి.మీ నల్లమల రక్షిత అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రెండు వరుసలుగా మాత్రమే విస్తరించాలని మొదట భావించారు.

    అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో కూడా నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కమిటీ ఆమోదం ఇచ్చింది.

    కానీ అటవీ అనుమతులు పొందడంలో జాప్యం జరిగితే, ఆ 25 కి.మీ ప్రాంతాన్ని రెండు వరుసలుగా మాత్రమే పరిమితం చేయాలని కమిటీ సూచించింది.

    వినుకొండ-గుంటూరు విస్తరణలో రహదారి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పేరేచర్ల సమీపంలో కలిసేలా ప్రత్యేకంగా నిర్ణయించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌ పాకిస్థాన్
    New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు.. అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు! కింజరాపు రామ్మోహన్ నాయుడు
    India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన! కేంద్ర ప్రభుత్వం
    Chiru-Anil: చిరు-అనిల్‌ రావిపూడి మూవీ.. షూటింగ్‌కు ముహూర్తం ఖరారు! చిరంజీవి

    ఆంధ్రప్రదేశ్

    Council of Higher Education: ఆ విద్యా సంస్థలపై కఠిన చర్యలు.. ఉన్నత విద్యామండలి హెచ్చరిక  భారతదేశం
    Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు భారతదేశం
    Ap Highcourt : గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు సినిమా
    Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక ఉప రాష్ట్రపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025