తదుపరి వార్తా కథనం
bomb threats: బాంబు బెదిరింపులకు పాల్పడితే కోటి రూపాయల జరిమానా
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 18, 2024
10:30 am
ఈ వార్తాకథనం ఏంటి
నకిలీ బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు కేంద్రం విమానయాన భద్రతా నియమాలను సవరించింది.
భారత్లో ఎవరైనా నకిలీ బాంబు బెదిరింపులతో విమాన రాకపోకల్ని ప్రభావితం చేస్తే, ఆ దోషులకు కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.
ఈ నిర్ణయంతో కేంద్రం తాజగా ఉత్తర్వులు జారీచేసింది.
ఇటీవల భారతదేశంలో అనేక విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు సంబంధించి సమాచారాలు వెలువడినాయి.
ఈ విధమైన బెదిరింపుల వల్ల ప్రయాణికులు, విమాన సిబ్బంది, పర్యవేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దారిమళ్లింపులు, సెక్యూరిటీ ప్రొటోకాల్ వంటి చర్యలు విమానయాన సంస్థలకు ఆర్థిక భారం మోపడం వల్ల చాలా ప్రభావితమయ్యాయి.