NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు 
    తదుపరి వార్తా కథనం
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు 
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు

    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు 

    వ్రాసిన వారు Stalin
    Jun 13, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్ భోపాల్‌లోని వివిధ శాఖల కార్యాలయాలు ఉండే ప్రభుత్వ భవనాల సముదాయం సాత్పురా భవన్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.

    ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్, అగ్నిమాపక దళం సంయుక్తంగా గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేసినట్లు ఓ అధికారి తెలిపారు.

    ప్రభావిత అంతస్తులన్నింటిలో మంటలు అదుపులోకి వచ్చాయని, ఆరో అంతస్తు నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయని, అగ్నిమాపక సిబ్బంది ఆ పొగలను నియంత్రించే పనిలో ఉన్నారని, దీనికి ఇంకో రెండు గంటల సమయం హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజేష్ రాజోరా చెప్పారు.

    ఉదయం దిల్లీ నుంచి వచ్చిన ఆయన భవనం పరిస్థితిని సమీక్షించారు.

    దిల్లీ

    అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు 

    భోపాల్‌లోని సాత్పురా భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

    ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, అయితే ఘటనపై విచారణ జరుపుతామన్నారు.

    మంటలు వ్యాపించడంతో అధికారులు, ఉద్యోగులందరినీ సకాలంలో సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

    అగ్నిమాపక యంత్రాలు, ఆర్మీ, సీఐఎస్ఎఫ్ సహా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించారు.

    ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు కనిపిస్తోందని భోపాల్ కలెక్టర్ అషీష్ సింగ్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భోపాల్
    మధ్యప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భోపాల్

    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం  మధ్యప్రదేశ్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    తాజా వార్తలు

    కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్ కెనడా
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్ బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025