NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు
    తదుపరి వార్తా కథనం
    గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు
    గంగపుత్రుల వలలో భారీ పండుగప్ప చేప

    గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 03, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్దనున్న గౌతమి గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప ఒకటి గంగపుత్రుల వలకు చిక్కింది.

    దాదాపు 15 కేజీల బరువుతో దొరికిన ఈ పండుగప్ప చేపను స్థానిక ఫిష్ మార్కెట్ లో వేలం వేశారు. దీంతో చేప ధర రూ.9 వేల ధర పలకింది.

    అయితే మత్స్యకార దంపతులైన పోనమండ భద్రం, రత్నంలు ఈ చేపను వేలంలో సొంతం చేసుకున్నారు. సముద్రం, గోదావరిలోనూ అరుదుగా వలకు చిక్కే పండుగప్ప రుచి చాలా బాగుంటుందని ఈ దంపతులు వెల్లడించారు.

    details

    సముద్రపు చేపల రుచుల్లో రారాజుగా పండుగప్ప

    మరోవైపు గోదావరి నదిలోనూ ఈ పండుగప్ప చేపలు దొరకడం అత్యంత అరుదని మత్స్యకారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలోనూ గోదావరిలో 20 కేజీల పండుగప్ప దొరకిందని గుర్తు చేసుకున్నారు.

    ఈసారి వలకు చిక్కిన పండుగప్ప బరువు దాదాపు 15 కేజీల వరకు ఉంటుందని స్థానిక మత్స్యకారులు వివరించారు. సముద్ర చేపల రుచుల్లోనే రారాజుగా పండుగప్ప పేరు గడించిందని గంగపుత్రులు స్పష్టం చేశారు.

    పండుగప్ప చేప ప్రత్యేకత ఎంటంటే ఇది ఉప్పు నీటితో పాటు మంచి నీటిలోనూ పెరగుతుందన్నారు. ఈ చేప మాంసాహార జీవి అని, మానవ శరీరానికి కావాల్సిన ప్రొటీన్లలో చాలా వరకు ఈ చేపలో లభిస్తాయని వైద్యఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025