NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్
    తదుపరి వార్తా కథనం
    కొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్
    కొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్

    కొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2023
    12:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొంతకాలం తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) సోమవారం తెలిపారు.

    ఈ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ పీఓకేలో షియా ముస్లింలు చేస్తున్న డిమాండ్లపై దౌసాలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    "పీఓకే అప్నే ఆప్ భారత్ కే అందర్ ఆయేగా. తోడా థండ్ రఖ్. (పీఓకే భారత్‌లో దానంతట అదే విలీనమవుతుంది. కొంత సమయం వేచి ఉండండి)", అని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అన్నారు.

    భారత అధ్యక్షతన ఇటీవల ముగిసిన G20 సమ్మిట్ విజయవంతం కావడం గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు.

    Details 

    అధికార కాంగ్రెస్‌పై విమర్శలు

    సమ్మిట్ విజయం వల్ల ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రపంచంలోనే దేశం తన సత్తాను నిరూపించుకుందని అన్నారు.

    అంతేకాకుండా, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో,శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆరోపించారు.

    ఈ కారణంగానే బీజేపీ పరివర్తన్ సంకల్ప్ యాత్రను నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా వినాలనుకుంటోందని అన్నారు.

    ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,వారు ఈ యాత్రకు మాతో పాటు కలసి వస్తున్నారని,మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారని,యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ప్రజా మద్దతు లభిస్తోందని అన్నారు.

    రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నా ప్రశ్నకు సింగ్ జవాబు ఇస్తూ..ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని, ప్రధాని చరిష్మాతోనే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    బీజేపీ

    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  లోక్‌సభ
    బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025