NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం
    తదుపరి వార్తా కథనం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2023
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషలిస్టు నేత, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

    అపస్మారక స్థితిలో ఉన్న శరద్ యాదవ్‌ను చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌‌కు తరలించారు. సీపీఆర్ ఎంత చేసిన .. ఫలితం లేనప్పటికీ.. గురువారం రాత్రి 10:19 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శరద్ యాదవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

    Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) January 12, 2023

    శరద్ యాదవ్

    ఏడుసార్లు లోక్‌సభకు, మూడు‌సార్లు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించిన శరద్ యాదవ్

    శరద్ యాదవ్ 1947 జులై 1న జన్మించారు. యుక్తవయసులో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. అంచెలంచెలుగా జాతీయ రాజకీయాల్లో ఎదిగారు. 1974లో తొలిసారిగా లోక్‌సభకు శరద్ యాదవ్ ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో పని చేశారు. శరద్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు లోక్ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్య వహించారు.

    2003లో శరద్ యాదవ్ జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2017 ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీతో జేడీయూ పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తును విభేదించిన శరద్ యాదవ్.. జేడీయూను వీడి 2018లో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ)ని ప్రారంభించారు. 2022లో ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మధ్యప్రదేశ్
    బిహార్

    తాజా

    Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడు
    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025