NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP News: బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.. ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP News: బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.. ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం
    బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.

    AP News: బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.. ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అనంతపురం నుండి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డీలో రెండు ముఖ్యమైన ప్యాకేజీలను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు.

    బుగ్గ-గిద్దలూరు మధ్య 135 కి.మీ, వినుకొండ-గుంటూరు మధ్య 84.80 కి.మీ, మొత్తంగా 219.80 కి.మీ (సుమారు 220 కి.మీ) విస్తరణ పనులను, రెండు ఎలైన్‌మెంట్లకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

    ఈ నిర్మాణ పనులకు రూ.5,417 కోట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కేటాయించనుంది.

    ఈ రెండు ప్యాకేజీలలో 21 చోట్ల బైపాస్‌లను నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు.

    వివరాలు 

    గిద్దలూరు-వినుకొండ మినహా.. 

    అనంతపురం నుంచి ముచ్చుకోట, బుగ్గ, కైప, గిద్దలూరు, వినుకొండ మీదుగా గుంటూరు వరకు ఎన్‌హెచ్‌-544డి ఉన్నది.

    ఇందులో అనంతపురం నుంచి బుగ్గ వరకు నాలుగు వరుసలుగా విస్తరణ పనులు ఇప్పటికే సాగుతున్నాయి.

    గిద్దలూరు-వినుకొండ మధ్య 135 కి.మీని రెండు వరుసలుగా విస్తరించి 2022లో అందుబాటులోకి తెచ్చి, ఆ రహదారిని గుత్తేదారికి అప్పగించారు.

    ఇక మిగిలిన బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య విస్తరించాల్సిన పని ఉంది.

    ఈ రెండు ప్యాకేజీలను ఇప్పుడు నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.

    అంటే, అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న నాలుగు ప్యాకేజీల్లో గిద్దలూరు-వినకొండ మధ్య 135 కి.మీ మినహా, మిగిలిన అన్ని ప్రాంతాలు నాలుగు వరుసలుగా మారతాయి.

    వివరాలు 

    అటవీ ప్రాంతంలోనూ నాలుగు వరుసలు 

    బుగ్గ-గిద్దలూరు మధ్య 135 కి.మీ విస్తరణలో, 25 కి.మీ నల్లమల రక్షిత అటవీ ప్రాంతం మీదుగా వెళ్ళే రహదారిలో, మొదట రెండు వరుసలుగా విస్తరించేందుకు ఆలోచనలు ఉన్నాయి.

    అయితే, రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తితో, ఆ ప్రాంతంలో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కమిటీ ఆమోదించింది.

    రాష్ట్రప్రభుత్వం వివిధ అనుమతులను త్వరగా అందించేందుకు సహకరించాలని కోరింది.

    రక్షిత అటవీ ప్రాంతం కావడంతో, నాలుగు వరుసల విస్తరణకు అనుమతులు లభించకపోతే, ఆ 25 కి.మీ దూరం రెండు వరుసలకే పరిమితం అవుతుందని కమిటీ సూచించింది.

    వినుకొండ-గుంటూరు ప్యాకేజీ రహదారి

    ఈ ప్యాకేజీలో రహదారి అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు మీద పేరేచర్ల సమీపంలో కలిసేలా నిర్ణయించబడ్డింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Google: 10 సంవత్సరాల తర్వాత గూగుల్ 'G' చిహ్నంలో మార్పు  గూగుల్
    Operation Sindoor: యూపీలో 17 మంది నవజాత శిశువులకు 'సిందూర్' అని అని నామకరణం.. ఇది కదా దేశభక్తి అంటే.. ఉత్తర్‌ప్రదేశ్
    Kantara 2: కాంతార2 టీమ్‌లో విషాదం.. గుండెపోటుతో మ‌రొక‌ జూనియర్ ఆర్టిస్ట్ క‌న్నుమూత‌  కాంతార 2
    Road Accident in US: అమెరికా పెన్సిల్వేనియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    AP Inter:సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలకు ప్రతిపాదనలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!  భారతదేశం
    Council of Higher Education: ఆ విద్యా సంస్థలపై కఠిన చర్యలు.. ఉన్నత విద్యామండలి హెచ్చరిక  భారతదేశం
    Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు భారతదేశం
    Ap Highcourt : గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025