Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, వారి స్వేచ్ఛను పెంచడమే ఈ పథకపు ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
మహిళల భద్రత కోసం మరో ముందడుగు
మార్చి 8న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తన ప్రభుత్వ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా, ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ నిర్ణయం వల్ల మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు, వారి దైనందిన జీవితానికి మరింత సౌలభ్యం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Details
హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
ఈ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
అయితే ఈ పథకం నాణ్యత, భద్రత పరంగా సమర్థవంతంగా అమలవుతుందా అనే అంశంపై మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, జమ్మూ కశ్మీర్లో 59 లక్షల మంది మహిళలు ఉన్నారు. గడిచిన 14 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
మహిళలు ఉద్యోగాలు, విద్య కోసం అధికంగా ప్రయాణిస్తున్నందున ఈ పథకం వారికి మరింత ప్రయోజనకరంగా మారనుంది.
Details
ప్రయివేటు ట్రావెల్స్ కు నష్టం
ఇదిలా ఉంటే, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (SRTC), స్మార్ట్ సిటీ బస్సుల ఆదాయంపై ఈ పథకం ప్రభావం చూపే అవకాశముందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.
అయితే SRTC జనరల్ మేనేజర్ షౌకత్ అహ్మద్ మాట్లాడుతూ, ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు తమ వ్యాపారంపై దీని ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Details
మహిళల ప్రయాణ భద్రతపై దృష్టి అవసరం
ఈ ఉచిత ప్రయాణ పథకం మహిళలకు ఖచ్చితంగా ప్రయోజనకరమైనదే. అయితే దీని ప్రభావం ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్ బస్సుల ఆదాయంపై పడనుంది.
ప్రభుత్వం తగిన ప్రణాళికతో ఆదాయ నష్టాన్ని భర్తీ చేస్తుందని సంబంధిత యాజమాన్యాలు భావిస్తున్నాయి.
అలాగే మహిళల భద్రత, ప్రయాణ నాణ్యతకు పెద్దపీట వేయాలని పలువురు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఉచిత ప్రయాణ విధానం ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.