
Mata Vaishno Devi: వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్లో విరిగిన కొండచరియలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు తాజాగా అభివృద్ధి చేసిన ట్రెక్కింగ్ మార్గంలో ఈరోజు కొండచరియలు కూలిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఆలయం రియాసీ జిల్లాలో ఉన్న త్రికూట పర్వత శ్రేణుల్లో ఉంది. తీవ్ర వర్షాల కారణంగా కొండలు కూలిపోవడంతో ఆ కొత్త ట్రెక్ను తాత్కాలికంగా మూసివేశారు. అధికారుల ప్రకారం, పాత మార్గంలో యాత్ర కొనసాగుతోంది. అయితే వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం బ్యాటరీ కార్లు,హెలికాప్టర్లు నడిపించడాన్ని నిలిపేశారు.
వివరాలు
సత్య వ్యూ పాయింట్ వద్ద భారీగా కొండచరియలు
హిమకోటి మార్గంలో ఉన్న సత్య వ్యూ పాయింట్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో కొన్ని రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. భక్తులకు కొత్త ట్రెక్లో ప్రయాణించడానికి అనుమతి ఇవ్వడం లేదు. భైరవ్ ఆలయానికి వెళ్లే దారిలోనూ కొండచరియలు పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు మార్గాల్లో పడిన శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్లో విరిగిన కొండచరియలు
Mata Vaishno Devi yatra :Landslides near Hemkoti on new track pic.twitter.com/rV7f1JOewD
— Cross Town News (@CrossTownNews) June 24, 2025