LOADING...
Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ ఆందోళన.. ఆరు నెలల్లో 27వేల మంది పైగా మృతి!
రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ ఆందోళన.. ఆరు నెలల్లో 27వేల మంది పైగా మృతి!

Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ ఆందోళన.. ఆరు నెలల్లో 27వేల మంది పైగా మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో జాతీయ రహదారులు మరణమార్గాలుగా మారుతున్నాయి. ఆరు నెలల్లో (జనవరి-జూన్ 2025) కాలంలో జాతీయ రహదారులపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో అదిరిపోయే స్థాయిలో 27,000 మంది మృతి చెందారని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. రాష్ట్రాల ఆధీనంలోని ట్రాఫిక్ నిర్వహణ, డ్రైవింగ్ నియంత్రణ వ్యవస్థల బలహీనతలే ఇందుకు ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు.

Details

ప్రతి ప్రాణం వెనుక ఓ కుటుంబం ఉంది

ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించి అక్కడ బలమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రాష్ట్రాలకు ఇప్పటికే సూచించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గడ్కరీ వివరించారు. ప్రతి ప్రమాద ప్రాణం వెనుక ఒక కుటుంబ బాధ ఉంది. దానిని తక్కువగా చూడలేం. ప్రాణహాని కేవలం గణాంకం మాత్రమే కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణం పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాద రహిత రవాణా కోసం అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.