NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / GHMC: నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    GHMC: నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్ 
    నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్

    GHMC: నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ఇప్పటికే అడుగుపెట్టింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.

    ఈ వర్షాల దృష్ట్యా మున్సిపల్ అధికారులు నగర ప్రజలకు కీలక సూచనలు జారీ చేస్తున్నారు.

    హైదరాబాద్‌లో కాస్త వాన పడితే చాలు.. రోడ్లు ముంపుకు గురవుతాయి, మాన్హోల్స్ పొంగిపొర్లడం సాధారణంగా మారిపోయింది.

    ఈ పరిస్థితులు ప్రతీ ఏడాది పునరావృతమవుతుండటంతో నగరవాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    అలాగే,నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపడుతుండటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

    దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ భాగ్యనగరవాసులకు కీలక హెచ్చరికను జారీ చేశారు.

    వివరాలు 

    వర్షాకాలం ముగిసే వరకు నగరంలో నిర్మాణాలకు అనుమతి ఉండదు 

    వర్షాకాలం ముగిసే వరకు నగరంలో నిర్మాణాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ సూచనల వివరాలు ఇలా ఉన్నాయి.

    వర్షాకాలం మొదలైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు జోనల్ కమిషనర్లతో కలిసి ముఖ్యాంశాలపై చర్చించారు.

    ఇందులో కర్ణన్ సెల్లార్ నిర్మాణాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    శుక్రవారం నుంచి వర్షాకాలం ముగిసే వరకు నగరంలో కొత్త సెల్లార్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు.

    వివరాలు 

    సెల్లార్ల నిర్మాణాలపై ప్రజలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు

    ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సెల్లార్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిలో నీరు నిల్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదే అని కర్ణన్ స్పష్టం చేశారు.

    ఈ విషయాన్ని వారికి తెలియజేసేందుకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.

    ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలో సెల్లార్ల నిర్మాణాలకు శాశ్వతంగా విరమించాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చినట్లు తెలుస్తోంది.

    గతేడాది వర్షాకాలం సమయంలో సెల్లార్ల నిర్మాణాలపై ప్రజలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    వర్షాలతో సెల్లార్లలో నీరు చేరి చుట్టుపక్కల నివసించే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఫిర్యాదులు వచ్చాయి.

    కొంతమంది వ్యక్తులు ఈ నీటిని మోటార్ల సహాయంతో బయటకు తోడుతూ రోడ్లపైకి వదిలేస్తున్నారు.

    వివరాలు 

    నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశం

    అంతేకాకుండా, ఈ సెల్లార్ల నిర్మాణం కోసం నేలలో ఎంతో లోతుగా తవ్వకాలు జరగడం వల్ల చుట్టుపక్కల భవనాలకు మట్టితో సంబంధిత ఇబ్బందులు కలుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    ఇది భద్రతాపరంగా కూడా గంభీరమైన సమస్యగా మారుతోంది. మరోవైపు, హైదరాబాద్ నగరం భూకంప ప్రభావిత ప్రాంతాల జోన్‌లో ఉందని గత నివేదికలు పేర్కొన్నాయి.

    నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశం ఉందని నిపుణులు కూడా హెచ్చరించారు.

    ఇలాంటి ప్రదేశాల్లో లోతైన సెల్లార్ల నిర్మాణాలు ప్రమాదానికి దారితీయవచ్చని వారు హెచ్చరికలు చేశారు.

    అందువల్ల నగరంలో ఇకపై సెల్లార్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ ఈ నిర్ణయం ఇప్పటివరకు అమల్లోకి రాలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    హైదరాబాద్

    Koheda: కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి రంగం సిద్ధం.. 199 ఎకరాలు.. రూ.1,901 కోట్లు.. భారతదేశం
    Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ పోలవరం
    Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి తెలంగాణ
    Hyderabad: హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ.. ఆలా చేస్తే భారీ జరిమానా, కనెక్షన్ కట్!  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025