LOADING...
Godavari: ఎట్టకేలకు గోదావరికి వరద.. అప్రమత్తమైన అధికారులు
ఎట్టకేలకు గోదావరికి వరద.. అప్రమత్తమైన అధికారులు

Godavari: ఎట్టకేలకు గోదావరికి వరద.. అప్రమత్తమైన అధికారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత కొద్ది రోజులుగా వెలవెలబోయిన గోదావరి నది ఎట్టకేలకు జలకళ సంతరించుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దేవీపట్నం మండలం వద్ద గోదావరి నది రూపురేఖలు మారిపోయాయి. వరద నీటి ప్రభావంతో నదిలో నీలం, ఎరుపు రంగుల కలయిక కనిపిస్తూ ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తోంది. ఈ అరుదైన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వివరాలు 

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

గండి పోచమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. వరద నీరు ఆలయ పరిసర ప్రాంతాల్లోకి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఆలయంలో హుండీ లెక్కింపు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Advertisement