LOADING...
Andhra Pradesh: కొబ్బరి రైతులకి మంచి రోజులు.. పండుగల ముందు ధరలు గరిష్ఠ స్థాయికి 
కొబ్బరి రైతులకి మంచి రోజులు.. పండుగల ముందు ధరలు గరిష్ఠ స్థాయికి

Andhra Pradesh: కొబ్బరి రైతులకి మంచి రోజులు.. పండుగల ముందు ధరలు గరిష్ఠ స్థాయికి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇంతకుముందెన్నడూ ఎప్పుడూ లేని రకంగా కొబ్బరి పంటకు రికార్డు స్థాయిలో ధరలు రావడం వల్ల, రైతులు,వ్యాపారులు ఇద్దరూ ఉత్సాహంతో కదులుతున్నారు. గత మూడు నెలలుగా ధరలు స్థిరంగా పెరుగుతూ, ప్రస్తుతం వెయ్యి కొబ్బరి కాయలకు గరిష్ఠంగా రూ. 30 వేలకు చేరాయి. దసరా, దీపావళి పండగల సమీపంలో ధర మరింత పెరగనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో సుమారు 9,300 హెక్టార్లలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్య తీర ప్రాంత మండలాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఎస్‌.రాయవరం మండలం "మినీ కోనసీమ"గా ప్రసిద్ధి పొందింది.

వివరాలు 

మూడు నెలల క్రమంలో వెయ్యి కొబ్బరి ధరలు సుమారు రూ.15వేలు 

గుడివాడ, రేవుపోలవరం, బంగారమ్మపాలెం, గుర్రాజుపేట, కొరుప్రోలు, ఎస్‌.రాయవరం, ధర్మవరం-అగ్రహారం, లింగరాజుపాలెం, సర్వసిద్ధి, వమ్మవరం తదితర ప్రాంతాల్లో కోట్లాది మంది రైతులు కొబ్బరి తోటలపై ఆధారపడి జీవన విధానం సాగిస్తున్నారు. రైతులంతా ధర్మవరం-అగ్రహారం డైలీ మార్కెట్‌లో కురిడి, బొండాం, టెంకాయలను విక్రయించడం వారి ప్రధాన వృత్తి. ఇక్కడి నుంచి వ్యాపారులు బీహార్, పట్నా, గోరఖ్‌పూర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు బొండాలను ఎగుమతి చేస్తారు. కురిడి, టెంకాయలను అయితే విశాఖపట్నం, శ్రీకాకుళం, నరసన్నపేట వంటి ప్రాంతాలకు పంపిస్తారు. గత మూడు నెలల క్రమంలో వెయ్యి కొబ్బరి ధరలు సుమారు రూ.15వేల స్థాయిలో ఉండేవి.

వివరాలు 

ధర పెరగడం ఊరట

అయితే ఈ సమయంలో టెంకాయలు, బొట్ట కాయలు (వెయ్యి) రూ. 25-27 వేల మధ్య, బొండాలు (వెయ్యి) రూ. 18 వేల వరకు ధర పలుకుతున్నాయి. ధరలు మూడు నెలల్లోనే రెట్టింపయ్యాయి కొంతమంది వ్యాపారులు కురిడి కాయలను నిల్వ చేసి, ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాబట్టి ఈ ఏడాది తెల్లదోమ, తెగుళ్లు, ఇతర చెడి పీడల కారణంగా కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గింది. గతంలో ఈ ప్రాంతంలో ఎకరాకు సగటున వెయ్యి కొబ్బరి కాయలు పొందేది,ఇప్పుడు కేవలం 650 కాయలే దిగుబడి వస్తోంది. దీంతో నష్టాలు తప్పవని రైతులు భయపడినా ధర పెరగడం ఊరటనిచ్చింది.