Loading...
Special trains: పండగల వేళ గుడ్‌న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్లు
పండగల వేళ గుడ్‌న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్లు

Special trains: పండగల వేళ గుడ్‌న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పండగల సమయంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో పలు మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అక్టోబరు 6 నుంచి నవంబరు 25 వరకు ప్రతి మంగళవారం, బుధవారం నడుస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వివరాలు

మరుసటి రోజు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌కు చేరుకుంటుంది

07037 నంబర్‌ రైలు చర్లపల్లి నుంచి అక్టోబరు 6, 13, 20, 27 తేదీల్లో, అలాగే నవంబరు 3, 10, 17, 24 తేదీల్లో బయల్దేరుతుంది.

ఈ రైలు మరుసటి రోజు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌కు చేరుకుంటుంది.

అదేవిధంగా 07038 నంబర్‌ రైలు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌ నుంచి అక్టోబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో, అలాగే నవంబర్‌ 4, 11, 18, 25 తేదీల్లో బయల్దేరుతుంది.

ఈ రైలు మరుసటి రోజు చర్లపల్లికి చేరుకుంటుంది.

అయితే ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించి బయల్దేరే సమయం, గమ్యస్థానానికి చేరుకునే సమయాలను అధికారులు ఇంకా ప్రకటించలేదు

వివరాలు

ఏయే స్టేషన్ల మీదుగా రాకపోకలు?

చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్‌, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ టూ టైర్‌, ఏసీ త్రీటైర్‌, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

పండగల సమయంలో స్వస్థలాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ADVERTISEMENT