NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayyappa: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 18 మెట్లు ఎక్కగానే నేరుగా అయ్యప్ప దర్శనం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ayyappa: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 18 మెట్లు ఎక్కగానే నేరుగా అయ్యప్ప దర్శనం
    అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 18 మెట్లు ఎక్కగానే నేరుగా అయ్యప్ప దర్శనం

    Ayyappa: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 18 మెట్లు ఎక్కగానే నేరుగా అయ్యప్ప దర్శనం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    09:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అయ్యప్ప భక్తులకు శుభవార్త! ఇకపై ఇరుముడితో వచ్చే భక్తులకు సన్నిధానం వద్ద మరింత సులభతరం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు.

    పుణ్య పద్దెనిమిది మెట్లు ఎక్కగానే, వారు నేరుగా అయ్యప్ప సన్నిధిలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తారు.

    గతంలో పదునెట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమ వైపుకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయాన్ని చుట్టూ తిరిగి, సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ద్వారా అయ్యప్ప సన్నిధి చేరుకోవాల్సి వచ్చేది.

    శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా, అధికారులు కొత్త లేఅవుట్‌ను రూపొందించారు.

    ఈ ప్రణాళిక ప్రకారం, సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తిగా తొలగిస్తారు. వచ్చే నెల 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు.

    Details

    ఒక నిమిషం పాటు దర్శించుకొనే అవకాశం

    ఈ సీజన్ నుంచి ఇరుముడితో వచ్చే భక్తులు 18 మెట్లు ఎక్కగానే, నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా ఏర్పాటు చేయనున్న రెండు లేదా నాలుగు లైన్ల ద్వారా సన్నిధానాన్ని చేరుకోగలరు.

    భక్తులు కణిక్కవంచి (బలికల్‌పుర-నైవేద్య పాత్ర) మార్గంలో నేరుగా ఎదురుగా ఉన్న అయ్యప్ప సన్నిధిని దర్శించుకోవచ్చు.

    ఇంతకు ముందు ఫ్లైఓవర్ దిగిన తర్వాత, భక్తులకు అయ్యప్ప సన్నిధిని ఎడమవైపు నుండి దర్శించుకునే అవకాశం ఉండేది.

    దీని వల్ల, అధిక రద్దీ సమయంలో తోపులాట, భక్తులపై పోలీసుల ఒత్తిడి పెరిగి, కొంతమంది భక్తులు పూర్తిగా దర్శనం చేసుకోలేక పోయేవారు.

    కానీ కణిక్కవంచి మార్గాన్ని అనుసరించడం వల్ల భక్తులకు 30 సెకన్ల నుండి 1 నిమిషం వరకు అయ్యప్ప స్వామిని ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం లభించనుంది.

    Details

    శబరిమలలో కుంభమాస పూజలు

    ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది.

    17వ తేదీ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి తొలగింపు సహా ఇతర అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయి. హైకోర్టు కూడా ఈ కొత్త ప్రణాళికకు ఆమోదం తెలిపింది.

    హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్ ఆర్. జయకృష్ణన్, ట్రావెన్‌కోర్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ పర్యవేక్షణలో పనులు కొనసాగించనున్నారు.

    గతంలో భక్తుల పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో 1989లో ప్రస్తుత ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.

    అయితే ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా ఇప్పుడు భక్తులకు మరింత సులభతరంగా అయ్యప్ప స్వామి దర్శనం కల్పించే విధంగా మార్పులు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శబరిమల

    తాజా

     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌
    PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్  చాహల్
    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్

    శబరిమల

    అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం కేరళ
    South Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు  తాజా వార్తలు
    Sabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే!  ఆలయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025