NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!
    తదుపరి వార్తా కథనం
    Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!
    రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!

    Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 15, 2025
    06:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో, ఇక్కడి ప్రజల వర్షాలపై ఆధారపడి ఉంటారు.

    పంటలు పుష్కలంగా పండేందుకు సమయానికి వర్షాలు కురవడం ఎంతో కీలకం.

    ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అందించింది. రానున్న వర్షాకాలంలో మాన్సూన్ జోరుగా కురుస్తుందని స్పష్టం చేసింది.

    IMD తాజా అంచనా ప్రకారం, 2025 రుతుపవన సీజన్‌లో సగటు కంటే 105 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

    అయితే లడఖ్, ఈశాన్య భారతం, తమిళనాడులో మాత్రం వర్షాలు కొంత తగ్గే అవకాశం ఉందని సూచించింది. ఎల్ నినో, హిందూ మహాసముద్ర ద్విధ్రువ ప్రభావాలు ఈసారి సాధారణంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.

    దేశవ్యాప్తంగా మాన్సూన్ మరింత ప్రభావవంతంగా ఉండనుందని అంచనా వేసింది.

    Details

    సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం

    యురేషియా, హిమాలయాల్లో మంచు మోతాదులో తగ్గుదల కూడా వర్షపాతాన్ని పెంచే అంశంగా నిపుణులు చెబుతున్నారు.

    వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, 2025లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని చెప్పారు.

    దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెం.మీ. కాగా, ఈ ఏడాది దానిలో 105 శాతం నమోదవుతుందని అంచనా. ఇది రైతులకే కాదు, నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకూ ఊరటను కలిగించనుంది.

    అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు తీవ్రమైన వేడి కొనసాగనుందని ఆయన హెచ్చరించారు. సాధారణంగా రుతుపవనాలు జూన్‌ చివరలో కేరళ తీరంలో ప్రవేశించి జూలై మధ్య నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    వర్షాకాలం

    తాజా

    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్

    భారతదేశం

    Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అమెరికా అభినందనలు అమెరికా
    work-life balance:కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు .. వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌పై 78% మంది అభిప్రాయమిదే!  భారతదేశం
    Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు ఇన్ఫోసిస్
    India Deports: అక్రమ వలసదారులపై భారత్ ఉక్కుపాదం.. ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది విదేశీయులు  భారతదేశం

    వర్షాకాలం

    వర్షాకాలంలో మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే?  గృహం
    IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు ఐఎండీ
    జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ప్రహ్లాద్ జోషి
    గుజరాత్‌‌లో కుండపోత వర్షం; 9మంది మృతి గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025