NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Annadata Sukhibhava: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Annadata Sukhibhava: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?
    రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?

    Annadata Sukhibhava: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 19, 2024
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలే అవుతోంది.

    ఈ సమయంలోనే ప్రభుత్వ పథకాల అమలుపై విమర్శలు చేయడం తొందరగా అనిపించవచ్చు. కానీ కొన్ని పథకాలకు ప్రతేడాది లబ్ది చేకూర్చకపోతే, ఆ పథకాల ప్రయోజనం సస్పెన్స్‌లో పడుతుంది.

    అలాంటి కీలక పథకాలలో ఒకటే 'అన్నదాత సుఖీభవ'. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతీ రైతుకు రూ.20,000 అందించాల్సి ఉంది.

    కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రూ.6,000 కింద ఆర్థిక సాయం అందుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అదనంగా ఇస్తామని హామీ ఇచ్చింది.

    Details

    మార్చిలో డబ్బు జమయ్యే అవకాశం

    దీనికోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలోపు మొత్తం నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది.

    ఇందుకోసం మొత్తం రైతులు 41.50లక్షల మంది వేచి యున్నారు. ఈ పథకానికి రూ.5,796 కోట్ల నిధులు అవసరమవుతాయి. ప్రస్తుతానికి రూ.4,500 కోట్లు కేటాయించారు.

    ఈ లెక్కలో కొంత తేడా ఉన్నప్పటికీ, ప్రభుత్వం తన హామీని నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్చి 31, 2025లోపు అన్నదాత సుఖీభవ అమలు పూర్తవుతుందని ఇప్పటికే మంత్రులు స్పష్టం చేశారు.

    రైతుల పథకంతో పాటు, మరో ముఖ్యమైన పథకం 'తల్లికి వందనం'. ఈ పథకం కింద ప్రతీ విద్యార్థి తల్లికి రూ.15,000 చొప్పున అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఈ పథకం అమలుపై స్పష్టత లేదు.

    Details

    తల్లికి వందనంపై రాని స్పష్టత

    అయితే తల్లికి వందనం నమ్మి పేదవర్గాలు అప్పులు చేసి పిల్లలను చదివిస్తుండటం గమనార్హం. ప్రజలు కూటమి ప్రభుత్వంపై బలమైన ఆశలు పెట్టుకున్నారు.

    ప్రభుత్వ హామీలను నమ్మి రైతులు, తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం హామీలు అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి

    ఆంధ్రప్రదేశ్

    Nara Lokesh: ముగిసిన నారా లోకేశ్ అమెరికా పర్యటన.. 100 కంపెనీలతో కీలక చర్చలు నారా లోకేశ్
    Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    Andhrapradesh: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..! ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
    AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. వారిపై కేసులు పెట్టేవారికి ర‌క్ష‌ణ‌ భారతదేశం

    ప్రభుత్వం

    Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్  తెలంగాణ
    Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!  కాంగ్రెస్
    WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు  దిల్లీ
    Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025