Loading...
SIR enumeration: ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. ఎస్‌ఐఆర్‌ ఫారాల గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు
ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. ఎస్‌ఐఆర్‌ ఫారాల గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

SIR enumeration: ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. ఎస్‌ఐఆర్‌ ఫారాల గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ గడువును మరోసారి పొడిగిస్తూ ఆగస్టు 10 వరకు అవకాశం కల్పించింది. నిర్ణీత తేదీలోగా ఓటర్లు తమ ఫారాలను పూర్తిచేసి సంబంధిత బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు (బీఎల్‌వోలు) అందజేయాలని ఎన్నికల సంఘం సూచించింది. మొదట ఈ ప్రక్రియకు జులై 24 వరకు గడువు నిర్ణయించిన ఎన్నికల సంఘం, అనంతరం దానిని ఆగస్టు 3 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి గడువు పెంచుతూ ఆగస్టు 10 వరకు ఫారాలు సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తైన అనంతరం ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

వివరాలు

77.12 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

ఈ ముసాయిదాపై సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనున్నారు.

అందిన అభ్యంతరాలను అక్టోబరు 15 నాటికి పరిష్కరించి, అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించనుంది.

తెలంగాణలో ప్రస్తుతం సుమారు 3.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ బీఎల్‌వోలు ఇప్పటికే 100 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు.

ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను తిరిగి బీఎల్‌వోలకు అందజేస్తుండగా, అధికారులు వాటిని ఎప్పటికప్పుడు డిజిటలైజ్‌ చేస్తున్నారు.

వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా 2.60 కోట్ల మంది ఓటర్లు

దరఖాస్తుల్లోని వివరాలను నమోదు చేయడంతో పాటు, 2002 ఓటర్ల జాబితాలోని సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ప్రత్యేక యాప్‌లో నమోదుచేస్తున్నారు.

శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.60 కోట్ల మంది ఓటర్ల వివరాలు, అంటే 77.12 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయింది.

జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43 శాతం, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం డిజిటలైజేషన్‌ పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT