తదుపరి వార్తా కథనం
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 20, 2025
04:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు.
2025-26 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్లను గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విభాగంలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన ప్రకటించారు.
సాధారణంగా టారిఫ్ల ప్రకటనను మార్చి 31లోపు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, ఈసారి ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రకటిస్తున్నామని తెలిపారు.