NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Coconut cultivation: ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Coconut cultivation: ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ
    ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ

    Coconut cultivation: ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 01, 2025
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఇప్పుడు వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నా, మరికొన్ని పంటల సాగులోనూ ఈ రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకునే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది.

    ఇప్పటివరకు రాష్ట్రంలో పెద్దగా సాగు చేయని కొబ్బరిపై దృష్టి పెట్టింది.

    కొబ్బరి సాగు రైతులకు కల్పించే ప్రయోజనాలను ప్రచారం చేయడంతో పాటు, రాష్ట్రంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలనీ కేంద్రానికి రెండు లేఖలు పంపింది.

    ఈ మండలి ఏర్పాటు ద్వారా రైతులకు కొత్త వంగడాలు, సాగు విధానాలు, యాజమాన్య నిర్వహణపై సాంకేతిక సహాయం, కొబ్బరి అనుబంధ ఉత్పత్తులు, సంబంధిత పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం అందుతుంది.

    వివరాలు 

    పెరిగిన నీటి వసతులతో రైతుల్లో ఆసక్తి 

    రాష్ట్రంలో ప్రస్తుతం 4,366 ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. ఈ పంట అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,800 ఎకరాల్లో సాగవుతోంది.

    ప్రస్తుతం రాష్ట్రంలో నీటిపారుదల వసతులు పెరిగిపోతున్నాయి, అలాగే కొబ్బరి బొండాలు, కాయలకు ధరలు పెరుగుతున్నాయి.

    ఈ అనుకూలతలతో రైతులు కొబ్బరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది రైతులు కొత్తగా కొబ్బరి సాగు కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

    వివరాలు 

    ఈ భూములు అనుకూలం 

    నీటిపారుదల సౌకర్యం ఉన్న,గాలిలో తేమ శాతం అధికంగా ఉండే ఎర్ర నేలలు కొబ్బరి సాగుకు అనుకూలంగా ఉంటాయి.

    ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించి ఇతర ప్రాంతాలలోనూ కొబ్బరిని సులభంగా సాగు చేసుకోవచ్చని భద్రాద్రి జిల్లా అక్కినపల్లి రైతు కమ్మిలి సూర్యనారాయణరాజు చెప్పారు.

    వివరాలు 

    ఎకరాకు సంవత్సరానికి రూ.1 లక్ష లేదా మరింత ఆదాయం

    ''రాష్ట్రంలోని రైతులు సాధారణ మొక్కలు ఎకరాకు 60 వరకు నాటినట్లయితే, హైబ్రిడ్ మొక్కలు 200 వరకు నాటుతున్నారు. వంగడాల రకాలు అనుసరించి 3-5 సంవత్సరాలలో పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కనీసం 50-70 సంవత్సరాలపాటు దిగుబడి ఉంటుంది. మొదటి సంవత్సరం తరువాత ప్రతి ఏడాది 8 వేల నుండి 10 వేల కాయలు దిగుబడిగా వస్తాయి. ప్రస్తుతం కాయ ధర రూ.10-15 మధ్య ఉంది. అంటే, ఎకరాకు సంవత్సరానికి రూ.1 లక్ష లేదా మరింత ఆదాయం వస్తుంది. కొబ్బరిలో మొదటి మూడు సంవత్సరాలు అంతరపంటలుగా కూరగాయలు, పసుపు, అల్లం, అరటి, పూలతోటలు, ఆ తరువాత కోకో పంటలు సాగించవచ్చు. అంతరపంటలతో ఏటా కనీసం రూ.50 వేల అదనపు ఆదాయం పొందవచ్చు'' అని నిపుణులు సూచించారు.

    వివరాలు 

    రాయితీలు ఇలా 

    కొత్తగా కొబ్బరి సాగు ప్రారంభించే రైతులకు ఎకరాకు అయ్యే ఖర్చులో 25% కొబ్బరి అభివృద్ధి మండలి సబ్సిడీగా ఇస్తుంది.

    రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద ఎకరాకు మూడేళ్లలో రూ.37,414 వరకూ రాయితీ అందిస్తుంది.

    సూక్ష్మసేద్యం పరికరాల కొనుగోలుకు అదనపు సబ్సిడీ కూడా అందుతుంది.

    ''రాష్ట్రంలో 2023-24లో 2.37 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తి చేయబడ్డాయి. అయితే, కేవలం కాయల అమ్మకం మినహా ఇతర ఆదాయాలు రావడం లేదు. ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుచేసినట్లయితే రైతులకు ప్రోత్సాహం లభించి, సాగు విస్తరించేందుకు అవకాశం ఉంటుంది'' అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం పెద్దపల్లి
    Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం భారతదేశం
    E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు కరీంనగర్
    Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025