NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి
    తమిళనాడును 'తమిళగం' అని పిలవడంపై గవర్నర్ రవి వివరణ

    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి

    వ్రాసిన వారు Stalin
    Jan 18, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు.

    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం తనకు లేదని గవర్నర్ రవి చెప్పారు. తాను 'తమిళగం' సంభోదించడం వెనుక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే, తనపై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు.

    ఈ వివాదానికి ముగింపు పలికేందుకే తాను ఈ వివరణ ఇస్తున్నట్లు గవర్నర్ ఆర్‌ఎన్ రవి పేర్కొన్నారు.

    తమిళనాడు

    తమిళ ప్రజలు, కాశీ మధ్య చారిత్రక సాంస్కృతిక అనుబంధం: గవర్నర్

    తమిళ ప్రజలు, కాశీ మధ్య చారిత్రక సాంస్కృతిక అనుబంధం ఉందని చెప్పారు గవర్నర్ రవి. ఆ కోణంలోనే తాను 'తమిళగం' అని సంభోదించినట్లు పేర్కొన్నారు. ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. అందుకే, చారిత్రక సాంస్కృతిక సందర్భంలో తాను తమిళగం అనే పదాన్ని వినియోగించినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సముచితమైన వ్యక్తీకరణగా ఆయన వివరించారు.

    తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ రవి మధ్య చాలా రోజులుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు సఖ్యత లేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మార్చి.. గవర్నర్ రవి చదవడంతో వివాదం ముదరింది. ఈ సమయంలో అధికార డీఎంకే శాసనసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసమయంలోనే ఆయన 'తమిళగం'గా గవర్నర్ సంభోదించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    గవర్నర్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్

    గవర్నర్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025