NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒక‌వైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
    తదుపరి వార్తా కథనం
    గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒక‌వైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
    గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒక‌వైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు

    గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒక‌వైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు

    వ్రాసిన వారు Stalin
    Jul 01, 2023
    06:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు.

    ఒక బహిరంగ సభలో శనివారం గవర్నర్ మాట్లాడుతూ, భారత సారాంశాన్ని మోదీ అర్థం చేసుకున్నారని అన్నారు. సనాతన ధర్మాన్ని మోదీ ప్రపంచానికి చాటారన్నారు.

    బలం స్నేహితులను ఆకర్షిస్తుందని, బలహీనత శత్రువులను ఆహ్వానిస్తుందని శుక్రాచార్య రాసిన 'శుక్రనీతి'లోని సంస్కృత శ్లోకాన్ని ఈ సందర్భంగా గవర్నర్ ఉటంకించారు.

    'అమృత్ కాల్' అనే సూత్రాన్ని మోదీ సృష్టించారన్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఈ దేశం సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆకాంక్షించారు.

    తమిళనాడు

    గవర్న్‌కు స్టాలిన్ లేఖ, బాలాజీని మంత్రిగా కొనసాగిస్తానని ప్రకటన

    వి.సెంథిల్ బాలాజీని మంత్రిగా తొలగించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి శుక్రవారం గవర్నర్ ఆర్ ఎన్ రవికి లేఖ రాశారు.

    తన మంత్రులను తొలగించే అధికారాలు గవర్నర్‌కు లేవని ఆ లేఖలో పునరుద్ఘాటించారు. ఆ అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

    తన సలహా లేకుండా తమ సహచరుడిని తొలగించిన మీ రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియ చెల్లదని ఎంకే స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.

    దోషిగా తేలిన తర్వాతే బాలాజీ అనర్హుడవుతాడని స్టాలిన్ చెప్పారు. బాలాజీని బర్తరఫ్ చేసినా మంత్రిగా కొనసాగిస్తానని స్టాలిన్ స్పష్టం చేశారు.

    తమిళనాడు

    గవర్నర్ అధికారాలపై రాజకీయ వర్గాల్లో చర్చ

    ఉద్యోగాల నగదు కుంభకోణం కేసులో సెంథిల్ బాలాజీని జూన్ 14న ఈడీ అరెస్టు చేసింది.

    జూన్ 13న చెన్నై, కరూర్, ఈరోడ్‌లోని బాలాజీ నివాసాలు, ఇళ్లపై ఈడీ దాడులు చేసింది.

    దాదాపు 18గంటలపాటు ప్రశ్నించిన ఈడీ జూన్ 14న మనీలాండరింగ్ ఆరోపణలపై బాలాజీని అరెస్టు చేసింది.

    అరెస్టు అనంతరం బాలాజీ పోర్ట్‌ఫోలియోలను తొలగించిన సీఎం స్టాలిన్, అతన్ని మంత్రిగా కొనసాగించారు.

    ఈ క్రమంలో మంత్రి సెంథిల్ బాలాజీపై నేరారోపణలు ఉన్నందున తమిళనాడు గవర్నర్ గురువారం ఆయనను భర్తరఫ్ చేసారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

    ఈ అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంంగా మారింది. ఈ వ్యవహారంతో గవర్నర్ అధికారాలు మరోసారి చర్చకు వచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    గవర్నర్
    ముఖ్యమంత్రి
    ఎం.కె. స్టాలిన్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్

    గవర్నర్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ

    ముఖ్యమంత్రి

    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  కర్ణాటక

    ఎం.కె. స్టాలిన్

    తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం తమిళనాడు
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  తమిళనాడు
    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025