NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
    ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

    AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 07, 2025
    10:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెరుగనున్నాయి.

    మద్యం దుకాణదారులు తమకు లభిస్తున్న మార్జిన్ సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం కమిషన్ పెంపునకు ఆమోదం తెలిపింది.

    ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

    2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.36 వేల కోట్ల ఆదాయం లభించింది.

    ఇందులో డిస్టిలరీలకు చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలు మినహాయించాక రూ.28-30 వేల కోట్ల మేర ప్రభుత్వం స్వీకరించింది.

    Details

    ప్రైవేట్ మద్యం దుకాణాల పాలసీపై అభ్యంతరాలు 

    గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

    మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అప్పగిస్తే, రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సూచించింది.

    అయినా ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటును అమలు చేసింది. 2023 అక్టోబర్ 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3,000కి పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి.

    20శాతం కమిషన్ లభిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం వ్యాపారులు పోటీ పడ్డారు.

    అయితే నియోజకవర్గాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధిపత్యంలోనే ఈ వ్యాపారాలు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

    Details

     కేబినెట్‌లో కమిషన్ పెంపుపై ఆమోదం 

    వ్యాపారులు తగిన లాభాలు రావడం లేదని అసంతృప్తితో డిసెంబర్‌లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలను నిలిపివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

    వ్యాపారుల ఆందోళనల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై మార్జిన్ పెంచేందుకు అంగీకరించినట్లు సమాచారం.

    గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నా, ఎన్నికల నిబంధనల కారణంగా అధికారిక ప్రకటన చేయలేకపోయారు.

    మద్యం ధరల తగ్గింపు వాస్తవమేనా?

    కొద్ది నెలలుగా మద్యం ధరలు తగ్గుతాయని వార్తలొచ్చినా మొత్తం రెండు బ్రాండ్ల ధరలే స్వల్పంగా తగ్గాయి.

    బ్రాందీ విభాగంలో ఓ ప్రముఖ నటుడు ప్రమోటర్‌గా ఉన్న బ్రాండ్ రూ.30 తగ్గించగా, గత ఐదేళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మరో బ్రాండ్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించింది.

    Details

    మద్యం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు ప్రచారాలు

    డిసెంబర్‌లో పది బ్రాండ్ల ధరలు తగ్గుతాయని ఎక్సైజ్ శాఖ ప్రచారం చేసినా, వాస్తవానికి ధరల తగ్గింపును ప్రభుత్వం అమలు చేయలేదు.

    2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యత లేని మద్యం సరఫరా అవుతుందన్న ఆరోపణలతో పాటు, మద్యం ధరలు 80-100శాతం పెరిగాయి.

    సంపూర్ణ మద్యం నిషేధం పేరుతో మొదట 200శాతం పెంచిన ధరలను, తర్వాత 100శాతం మేర తగ్గించారు.

    ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా లభించే ఆదాయాన్ని 'అమ్మఒడి' వంటి సంక్షేమ పథకాలకు మళ్లించిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో వైసీపీ పాలనలో మద్యం వ్యాపార విధానం ప్రజా వ్యతిరేకతకు గురైంది.

    Details

     త్వరలో మద్యం ధరల పెంపు తథ్యం! 

    ప్రస్తుతం దుకాణదారులకు 14.5% మార్జిన్ చెల్లించాలన్న నిర్ణయంతో మద్యం ధరలు పెరగడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

    ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోకుండా ధరలను తగిన విధంగా పెంచే యోచనలో ఉంది.

    ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనల ప్రకారం

    రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 పెంపు

    క్వార్టర్ రూ.99 బ్రాండ్లు మినహా మిగిలిన అన్నిటిపై రూ.10 పెంపు

    కొత్త మార్జిన్ రేట్లు: 10.5% -14%

    ఈ మార్పుల వల్ల ప్రభుత్వం రూ.135 కోట్లు మాత్రమే నష్టపోతుందన్న లెక్కలు వేస్తున్నారు. కానీ రూ.320 కోట్ల అదనపు ఆదాయం కోసం మరింత పెంపు చేసే అవకాశమూ ఉంది.

    ప్రస్తుతం వ్యాపారులకు 10% కంటే తక్కువ కమిషన్ లభిస్తుండగా, 14% మార్జిన్ పెంచేలా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Andhra news: నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు  పర్యాటకం
    Etikoppaka: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటం గణతంత్ర దినోత్సవం
    Andhra News: పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు.. ఏపీ మారిటైం బోర్డు నిర్ణయం భారతదేశం
    Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025