NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు
    తదుపరి వార్తా కథనం
    Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు
    స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు

    Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 03, 2024
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని, కాకినాడ పోర్టు భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

    సోమవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.

    రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సిందేనని మంత్రులు స్పష్టం చేశారు.

    కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌ఓ)ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

    రేషన్‌ బియ్యం రవాణా చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకు సంబంధించి అధికారుల చర్చ కొనసాగుతోంది.

    Details

    బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

    ప్రస్తుతం కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ కేంద్రంగా మారిన పరిస్థితి చర్చనీయాంశమైంది.

    రేషన్‌ బియ్యాన్ని పాలిష్ చేసి సిల్కీ రైస్‌గా మార్చేందుకు సార్టెక్స్‌ యంత్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది.

    పోర్టు గోదాముల్లో యంత్రాలు ఏర్పాటు చేసి మిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న విషయం ఐదు నెలల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో బయటపడిన విషయం తెలిసిందే.

    సార్టెక్స్ యంత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారుల్ని హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాకినాడ సిటీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Delhi: ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు దిల్లీ
    Rain Alert: తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ భారీ వర్షాలు
    Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు.. తమిళనాడు
    Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు  ఇండోర్

    కాకినాడ సిటీ

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం  భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    Polavaram: పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన పోలవరం
    New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల భారతదేశం
    Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ విశాఖపట్టణం
    AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025