NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం 
    పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం

    Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

    అంతేకాదు, గతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో చేసిన దాడుల దృశ్యాలను కూడా బహిర్గతం చేయాలని యోచనలో ఉంది.

    పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచానికి స్పష్టంగా చూపించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

    ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో పర్యాటకులపై ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా దాడికి పాల్పడగా, దాంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ సంఘటన తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

    వివరాలు 

      మోదీ నివాసంలో అత్యంత కీలక భేటీ

    దీనికి సంబంధించి భారత్‌ కీలక దౌత్య చర్యలు తీసుకుంది. మొదటిగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్, వెంటనే పాక్ పౌరులను దేశం విడిచిపెట్టాలని ఆదేశించింది.

    ఈ చర్యలతో పాకిస్థాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సిమ్లా ఒప్పందం సహా ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలన్నింటినీ పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది.

    ఇక నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన అత్యంత కీలక భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,త్రిదళాధిపతి అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్,ఆర్మీ,నేవీ,వైమానిక దళాల అధిపతులు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    వివరాలు 

    భారత సాయుధ దళాల నైపుణ్యం,సామర్థ్యం నమ్మకం 

    సుమారు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో దేశ అంతర్గత భద్రత పరిస్థితులు, సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలపై విశ్లేషణ జరిగింది.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ - పహల్గాం దాడికి బాధ్యులైన వారిని తగిన శిక్షకు గురిచేయాలన్నదే దేశ ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు.

    భారత సాయుధ దళాల నైపుణ్యం,సామర్థ్యం మీద తనకు పూర్తి నమ్మకముందని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప

    కేంద్ర ప్రభుత్వం

    Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం లోక్‌సభ
    Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది? తెలంగాణ
    Nirmala Sitharaman: భారీగా పన్ను మినహాయించడానికి కారణమిదే.. నిర్మాలా సీతారామన్ వివరణ నిర్మలా సీతారామన్
    Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025