NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్
    హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

    హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 28, 2023
    03:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    పాతబస్తీ పరిధిలోని టోలీచౌకికి చెందిన ఫసీ సహా ఆయన కుమార్తెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

    గుజరాత్ లోని సూరత్ నగరానికి చెందిన సుబేరా బాను, శ్రీనగర్ కు చెందిన నాజిర్, హయత్, అజీమ్ లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డట్టు సమాచారం.

    ఉగ్రవాద కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకే ఈ గ్రూప్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముఠాను లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.

    DETAILS

    పెద్దపల్లి జిల్లాలో తండ్రి కూతురు అరెస్ట్

    ఐఎస్‌కేపీ ఉగ్రవాద కేసును గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు బుధవారం అమీర్‌పేట్ లోని ఓ సాఫ్ట్ వేర్ కోచింగ్‌ సెంటర్లలో సోదాలు జరిపింది.

    అయితే అంతకు ముందు రోజే 18 ఏళ్ల యువకుడితో పాటు మరో నలుగురిని విచారించింది.అనంతరం ఇవాళ సోదాలు చేపట్టింది.

    మంగళవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిధి ఎన్టీపీసీ శ్రీనగర్ కాలనీకి చెందిన ఈ ఇద్దరిని ఏటీఎస్ టీమ్ అదుపులోకి తీసుకుంది.

    ఈ ఇద్దరిలో తండ్రీ జావేద్, కూతురు ఖదీజా ఉన్నారు. వీరు హైదరాబాద్‌ టోలీచౌకిలో నివాసం ఉంటారు.బక్రీద్‌ వేడుకల కోసం ఎన్‌టీపీసీలోని తమ బంధువుల ఇంటికి వెళ్లడంతో ఏటీఎస్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉగ్రవాదులు
    గుజరాత్
    హైదరాబాద్

    తాజా

    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్
    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా
    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం

    ఉగ్రవాదులు

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి పాకిస్థాన్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    గుజరాత్

    ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌ ముంబై
    తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు బీబీసీ
    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి నరేంద్ర మోదీ

    హైదరాబాద్

    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల తెలంగాణ
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా? తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025