NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాకినాడలో తీవ్ర విషాదం.. పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి
    తదుపరి వార్తా కథనం
    కాకినాడలో తీవ్ర విషాదం.. పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి
    పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి

    కాకినాడలో తీవ్ర విషాదం.. పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 15, 2023
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ నాటు తుపాకీ గురితప్పి పేలిన కారణంగా నాలుగేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.

    తుని మండలం వెలమ కొత్తూరులో పందులను చంపేందుకు కొందరు వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ధన్యశ్రీ ఆకస్మికంగా మరణించింది.

    మంగళవారం ఉదయం వెలమ కొత్తూరులో పెంపుడు పందులను వేటాడేందుకు గ్రామస్తులు నాటు తుపాకీని వినియోగించారు. ఈ విషయం తెలియని నాలుగేళ్ల పాప ఎప్పటిలాగే ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటోంది.

    ఈ నేపథ్యంలో తుపాకీ పేల్చడంతో గురితప్పి ధన్యశ్రీకి తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

    DETAILS

    శోకసంద్రంలో చిన్నారి తల్లిదండ్రులు

    విషయాన్ని తోటి స్నేహితులు వెంటనే బాధిత తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి వచ్చిన తల్లిదండ్రులు, వెంటనే బాధిత చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో ఆమె తుదిశ్వాస విడిచింది.

    కూతురు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెలమకొత్తూరు గ్రామంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    అనంతరం నిందితులని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాటు తుపాకులను ఉపయోగించిన కారణంగా ఆయా సెక్షన్ల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి  సూర్య
    పవన్ కళ్యాణ్ బైజూస్ ట్వీట్ పై బొత్స కామెంట్స్: ట్యూషన్ చెప్తానంటున్న మంత్రి  పవన్ కళ్యాణ్
    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు జోరుగా వానలు భారతదేశం
    సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025