NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
    హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ

    హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 20, 2023
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర పోరు 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది.

    హమాస్ స్థావరాలే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతుండగా, హమాస్ సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది.

    ఇప్పటికే ఈ అధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 5000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    ఒక్క గాజాలోనే 1524 మంది చిన్నారులతో సహా 3700 మంది మృత్యువాత పడ్డారు.

    ఈ యుద్ధంపై ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

    గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో పౌరుల మరణాల పట్ల మోదీ సంతాపం ప్రకటించారు.

    Details

    పాలస్తీనాలో నెలకొన్న హింసపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ

    పాలస్తీనా ప్రజలు కోసం భారత్ మనవతా సహాయాన్ని కొనసాగిస్తుందని మోదీ చెప్పారు.

    పాలస్తీనాలో నెలకొన్న తీవ్రవాదం, హింసపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.

    ఇదిలా ఉండగా, ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌లో పర్యటించి, హమాస్ దాడులను ఖండించిన విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో మోదీ పాలస్తీనా అధ్యక్షుడికి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ట్విట్టర్ లో స్పందించిన మోదీ

    Spoke to the President of the Palestinian Authority H.E. Mahmoud Abbas. Conveyed my condolences at the loss of civilian lives at the Al Ahli Hospital in Gaza. We will continue to send humanitarian assistance for the Palestinian people. Shared our deep concern at the terrorism,…

    — Narendra Modi (@narendramodi) October 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్
    Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు.. సుప్రీంకోర్టు

    నరేంద్ర మోదీ

    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్  ప్రధాన మంత్రి
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి తైవాన్
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  మహిళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025