Harish Rao: కాంగ్రెస్కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు
వ్రాసిన వారు
Stalin
Dec 16, 2023
02:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో గవర్నర్ ప్రసంగంపై కీలక చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ను టీఆర్ఎస్సే అధికారంలోకి తీసుకొచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్కు అధికార భిక్ష పెట్టిందే కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్కు కేసీఆర్ జీవం పోసినట్లు వివరించారు. 2004లో కేసీఆర్ కాంగ్రెస్కు జీవం పోసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రావడానికి కారణం బీఆర్ఎస్సే అని వెల్లడించారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడించినట్లు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మట్లాడుతున్న హరీశ్ రావు
లేవలేని కాంగ్రెస్కు 2004లో జీవం పోసిందే బీఆర్ఎస్#Assembly #BRS #Congress #HarishRao #RevanthReddy pic.twitter.com/V1ltwKf81f
— KCR Adda (@KCR_Adda) December 16, 2023