NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో 
    తదుపరి వార్తా కథనం
    Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో 
    ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో

    Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేసింది.

    "సాత్ వాదే, పక్కే ఇరదే" పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హర్యానా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

    ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 7 ప్రధాన హామీలను ప్రకటించింది.ఈ మేనిఫెస్టో ప్రకారం,కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, 18నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ప్రతి నెలా రూ.2000 అందజేస్తామని పేర్కొంది.

    రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు,వృద్ధులు,వితంతువులు,వికలాంగులకు రూ.6000 పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చింది.

    ఎంఎస్‌పీ గ్యారెంటీ చట్టం,300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కూడా ముఖ్యమైన వాగ్దానాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    బీజేపీ పాలనలో హర్యానా నేరాల కేంద్రంగా మారింది

    అదనంగా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, పేదలకు 100 గజాల ఉచిత ప్లాట్లు ఇస్తామని పేర్కొన్నారు.

    కుల గణన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతామని, మరిన్ని వాగ్దానాలను చండీగఢ్‌లో ప్రకటిస్తామని అన్నారు.

    53 పేజీల మేనిఫెస్టోలో అన్ని అంశాలను సమగ్రముగా అందజేస్తామని చెప్పారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, కాంగ్రెస్ హయాంలో హర్యానా అభివృద్ధి పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.

    బీజేపీ పాలనలో హర్యానా నేరాల కేంద్రంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా తీర్చిదిద్దుతామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    కాంగ్రెస్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    హర్యానా

    Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్‌కేసులో..  హత్య
    Rahul Gandhi: డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్, నిరసనల మధ్య.. హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ   రాహుల్ గాంధీ
    Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి  దిల్లీ
    Video: అపార్ట్మెంట్ లోపలికి చొరబడిన చిరుత  భారతదేశం

    కాంగ్రెస్

    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Amedhi-Smrithi Irani-Rahul Gandhi: అమేథీ లోక్ సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ స్మృతీ ఇరానీ కీలక వ్యాఖ్యలు స్మృతి ఇరానీ
    Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025