Page Loader
Hathras case: పరిమితికి మించి వచ్చిన భక్తల వల్లే తొక్కిసలాట 
Hathras case: పరిమితికి మించి వచ్చిన భక్తల వల్లే తొక్కిసలాట

Hathras case: పరిమితికి మించి వచ్చిన భక్తల వల్లే తొక్కిసలాట 

వ్రాసిన వారు Stalin
Jul 09, 2024
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని హత్రాస్‌ ఘటనపై విచారణ జరుపుతున్న సిట్ 300 పేజీల నివేదికను సమర్పించింది. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. తొక్కిసలాట జరగడానికి రద్దీ ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. సత్సంగం కోసం 2 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చారు. అయితే అధికారులు దాదాపు 80,000 మందికి అనుమతి కోరారు.వివరాల ప్రకారం.. 119 మంది వాంగ్మూలాలను నివేదికలో పొందుపరిచారు.

వివరాలు 

నివేదికలో అధికారుల,బాధితుల,ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు 

నివేదికలో హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్, ఆశిష్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్, నిపున్ అగర్వాల్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఇతరుల ప్రకటనలు కూడా ఉన్నాయి. తొక్కిసలాట జరిగిన జూలై 2న విధుల్లో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను కూడా పొందుపరిచారు. సిట్ నివేదికలో బాధిత కుటుంబాల వాంగ్మూలాలు కూడా ఉన్నాయి.అంతకుముందు, హత్రాస్ తొక్కిసలాట కేసులో ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ కమిషన్ బృందం పలువురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. జూలై 6న హత్రాస్ తొక్కిసలాట కేసులో భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్‌పై కేసు నమోదైంది. అదే రోజు, బాబా ఒక సందేశంలో, హత్రాస్ తొక్కిసలాట ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ,బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామీనిచ్చారు.