NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhole Baba: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన జ్యుడిషియల్‌ కమిషన్‌ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhole Baba: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన జ్యుడిషియల్‌ కమిషన్‌ 

    Bhole Baba: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన జ్యుడిషియల్‌ కమిషన్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras Stampede) ఘటనలో గత సంవత్సరం 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

    దీనిపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో మూడు మంది సభ్యులతో కూడిన జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

    తాజాగా, ఈ కమిషన్ యూపీ ప్రభుత్వానికి పూర్తి నివేదికను సమర్పించింది. ఈ ఘటనకు భోలే బాబాకు సంబంధం లేదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

    ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.

    భక్తుల అధిక సంఖ్యలో హాజరు కావడం వల్ల, ఊపిరాడకపోవడం కారణంగానే వారు మరణించారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

    వివరాలు 

    వివాదాస్పద ఘటన - ప్రభుత్వం నిర్ణయం 

    ఈ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత, ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో యూపీ శాసనసభలో సమర్పించే అవకాశం ఉంది.

    నివేదిక ప్రకారం, సత్సంగ్ నిర్వహకులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని జ్యుడిషియల్ కమిషన్ అభిప్రాయపడింది.

    ఇంతకు ముందు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కూడా ఈ ఘటనకు భోలే బాబా ప్రమేయం లేదని పేర్కొంది.

    ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం,హాథ్రస్ జిల్లా సికంద్రరావ్ ప్రాంతం ఫుల్‌రయీ,ముగల్‌గఢీ గ్రామాల మధ్య ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

    వివరాలు 

    హాథ్రస్ తొక్కిసలాట - ఏం జరిగింది? 

    నివేదిక ప్రకారం.. నిర్వాహకులు 80 వేల మంది భక్తులు మాత్రమే హాజరవుతారని పోలీసుల అనుమతి తీసుకున్నారు.

    అయితే అదే రోజు 2.5 లక్షల మందికి పైగా భక్తులు అక్కడికి చేరుకున్నారు. సత్సంగ్ ముగిసిన తర్వాత, భక్తులు భోలే బాబా వెనక పరుగెత్తడం, ఆయన పాదాల వద్ద మట్టిని తీసుకోవడానికి ప్రయత్నించడం వంటివి జరిగాయి.

    దీంతో తొక్కిసలాట ఏర్పడి 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారందరికీ ఊపిరాడకపోవడం వల్లే మృతి సంభవించినట్లు శవపరీక్షల్లో తేలిందని ఎటాలో జిల్లా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

    ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భోలే బాబాను నిందితుడిగా చేర్చలేదని అలీగఢ్ ఐజీ శాలభ్ మాథుర్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం

    ఉత్తర్‌ప్రదేశ్

    UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి ఇండియా
    Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం భారతదేశం
    Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య భారతదేశం
    Lucknow Murders: లఖ్‌నవూ హత్య: కేసును తప్పుదోవ పట్టించడానికి అర్షద్‌ వీడియో రిలీజ్‌! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025