NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Sharmila: 'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్‌పై షర్మిల ఫైర్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    YS Sharmila: 'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్‌పై షర్మిల ఫైర్
    'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్‌పై షర్మిల ఫైర్

    YS Sharmila: 'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్‌పై షర్మిల ఫైర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 04, 2025
    05:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తల్లి మీద కేసు వేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.

    విజయవాడలో వక్ఫ్ బిల్లు అంశంపై మాట్లాడిన ఆమె, ఎన్సీఎల్టీలో జగన్ దాఖలు చేసిన అఫిడవిట్‌పై స్పందించారు.

    జగన్ స్వయంగా ఎంవోయూపై సంతకం పెట్టారని, ఆస్తులు ఎవరికి అనేది తానే నిర్ణయించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటిని కూడా ఇవ్వలేదని విమర్శించారు.

    ఇచ్చిన గిఫ్ట్ తనకే కాకుండా తల్లి విజయమ్మకు కూడా అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆస్తులను వెనక్కి అడుగుతున్నారని, తల్లిని మోసం చేస్తున్నాడని ఆరోపించారు.

    జగన్ నన్ను ప్రభావితం చేసే స్థాయిని ఎప్పుడో దాటి పోయారని, కానీ తన పిల్లలను మోసం చేసిన వాడిగా మిగిలిపోయారన్నారు.

    Details

    ఎన్సీఎల్టీలో కేసు 

    తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనకోడలికి చెందిన ఆస్తులను కాజేసిన మేనమామగా జగన్ పేరుమిగిలిపోతుందని షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.

    తన ఆస్తుల గురించి జగన్ ఏమి నిర్ణయిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి లేదని, ఇకపై అది తనకు సంబంధం లేదని తేల్చేశారు.

    తమకు తెలియకుండానే 51% వాటాలను అక్రమంగా బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    జగన్ తరఫు లాయర్ వాదన ప్రకారం, గిఫ్ట్ షేర్లను తాను భౌతికంగా ఇవ్వలేదని, అందువల్ల బహుమతి ఇంకా పూర్తిగా అందలేదని తెలిపారు.

    తన తల్లి విజయలక్ష్మి షేర్ల బదిలీ అక్రమమని, ఆమె తన కుమార్తెకు అనుకూలంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు.

    Details

    జగన్ ఆస్తుల పెరుగుదలపై షర్మిల ఆరోపణలు

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని, తండ్రి హయాంలో ఆస్తులు ఇద్దరికీ చెందతాయని వైఎస్ స్వయంగా చెప్పారని షర్మిల తెలిపారు.

    కానీ ఆయన మరణం తర్వాత, జగన్ మొత్తం ఆస్తుల్ని కాజేయాలని చూసారని ఆరోపించారు.

    కుటుంబ ఆస్తుల వివాదం చివరికి కోర్టులోకి వెళ్లింది. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో కొన్ని ఆస్తులు ఇప్పటికీ జప్తులో ఉన్నాయని షర్మిల గుర్తుచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ షర్మిల
    కాంగ్రెస్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    వైఎస్ షర్మిల

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ కాంగ్రెస్
    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ వై.ఎస్.జగన్

    కాంగ్రెస్

    Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క తెలంగాణ
    TS Education Commission: ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు తెలంగాణ
    Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ భారతదేశం
    Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ  రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025