NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Heavy rains: వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు.. స్తంభించిన జనజీవనం 
    తదుపరి వార్తా కథనం
    Heavy rains: వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు.. స్తంభించిన జనజీవనం 
    వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు

    Heavy rains: వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు.. స్తంభించిన జనజీవనం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 17, 2024
    11:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసింది.

    బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జనజీవనం స్తంభించింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.

    చేతికొచ్చిన వరి పైరు నేలవాలి రైతన్నకు కన్నీరే మిగిలింది. కోత దశలో ఉన్న టమాట దెబ్బతింది. పొగాకు తదితర పంటలకూ నష్టం వాటిల్లింది.

    వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతోపాటు ప్రధాన వీధుల్లో మోకాలి లోతు నీరు ప్రవహించింది.

    నెల్లూరు,కడప,తిరుపతి,నంద్యాల తదితర నగరాలు,పట్టణాలు జలమయమయ్యాయి.

    వివరాలు 

    చెరువులను తలపించిన రహదారులు

    నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్, కనకమహల్‌ సెంటర్, ముత్తుకూరు కూడలి సమీపంలోని రైల్వే అండర్‌పాస్‌ వద్ద వర్షపు నీరు నిలిచింది.

    మాగుంట లేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జి, రామలింగాపురం, లెక్చరర్స్‌ కాలనీ, హరినాథపురం నాగసాయి మందిరం తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.

    కడపలో రహదారులు చెరువులను తలపించాయి. మురుగు కాలువల్లో ప్రవాహం లేక రహదారులపై వరద ప్రవహించింది.

    తిరుపతి పరిధిలోని గొల్లవానిగుంట, పూలవానిగుంట, ఆటోనగర్, రేణిగుంట సమీపంలోని భగత్‌సింగ్‌ కాలనీ, జ్యోతిరావు ఫులే కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ఒంగోలు నగరంలోని పలు లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు చేరింది.

    వివరాలు 

    కొట్టుకుపోయిన రహదారులు 

    ప్రతి రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు తిరిగే ఇండిగో విమానం నిర్ణీత సమయానికి ఇక్కడికి వచ్చినా.. భారీ వర్షం కారణంగా చెన్నైకి మళ్లించారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత విమానం తిరిగి రేణిగుంటకు చేరుకుంది.

    అలాగే దిల్లీ నుంచి రేణిగుంటకు ఇటీవల ప్రారంభించిన ఇండిగో విమానం కూడా కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి దిగింది.

    మొత్తానికి ఇతర ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి విమానం ఆలస్యంగానే చేరుకున్నాయి.

    వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం బుసిరెడ్డిపల్లె సమీపంలో వంకపై ఉన్న రహదారి కొట్టుకుపోయింది.

    తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాజ్‌వేలపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

    వివరాలు 

    కొట్టుకుపోయిన రహదారులు 

    వరదయ్యపాలెం పరిధి గోవర్ధనపురం వద్ద కాలువ వంతెనపై నీటి ప్రవాహం పెరగడంతో శ్రీకాళాహస్తి-తడ మార్గంలో రాకపోకలకు అంతరాయమేర్పడింది.

    రేణిగుంట-మామండూరు రహదారిలో చెట్లు కూలి ట్రాఫిక్‌ స్తంభించింది. ఎరుపేడు-మోదుగులపాలెం స్వర్ణముఖి నది కాజ్‌వేపై నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలు నిలిపేశారు.

    తొట్టంబేడు మండలంలోని చట్టత్తూరు వాగుతోపాటు కారాకొల్లు సమీపంలోని కాజ్‌వేపై రాకపోకలు నిలిచాయి.

    శ్రీకాళాహస్తి మండలం నారాయణపురం పంచాయతీలోని ముల్లపూడి గిరిజన కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది.

    ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రామన్న చెరువు కట్ట తెగడంతో 216వ జాతీయరహదారిపైకి నీరు చేరింది.

    దీంతో చీరాల వైపు వెళ్లే వాహనాలను పాత బైపాస్‌ మీదుగా మళ్లించారు.

    వివరాలు 

    పంటలు జలార్పణం 

    ఒంగోలు మండలం కరవది-గుత్తికొండవారిపాలెం గ్రామాల మధ్య ఉన్న ముదిగొండ వాగు రెండు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

    విశాఖపట్టణంలోని ఇసుకతోట ప్రాంతం జలమయమైంది.ద్విచక్రవాహనాలు,కార్లు మునిగిపోయాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం కోతకు గురైంది.

    నెల్లూరు జిల్లాలోని చేజర్ల, అనంతసాగరం, విడవలూరు,ఎస్‌.ఆర్‌.పురం ప్రాంతాల్లో సుమారు 244 హెక్టార్లలో వేసిన వరి పంట నేలవాలింది.

    అన్నమయ్య జిల్లాలో టమాటకు ప్రస్తుతానికి నష్టం లేకపోయినప్పటికీ నీటి నిల్వ వల్ల వేరుకుళ్లు తెగులు వచ్చి దెబ్బతినే అవకాశముంది. ఇక్కడ నేల వాలిన వరిలో గింజలు మొలకెత్తాయి.

    వైఎస్సార్‌ జిల్లాలో 2,024 ఎకరాల్లో వరి,254 ఎకరాల్లో మినుముకు నష్టం వాటిల్లింది.ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.

    తిరుపతి జిల్లావ్యాప్తంగా 2,913 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లాలో పొగాకు దెబ్బతింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్

    భారీ వర్షాలు

    Dubai airport flooded : దుబాయ్ లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం దుబాయ్
    Pakistan : పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 71 మంది మృతి , 67 మందికి గాయలు  పాకిస్థాన్
    Tragedy: హైదరాబాద్ లో ఘోర విషాదం.. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి  హైదరాబాద్
    Heavy Rain:హైదరాబాద్ లో భారీ వర్షం .. అరగంటలో 5 సెంటిమీటర్ల వాన  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు పోలీస్
    Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి
    Chandra Babu: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. చెత్త పన్ను రద్దు  చంద్రబాబు నాయుడు
    Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025